‘ఫ్రంట్ షేక్..బ్యాక్ షాక్’!

By Super
|
Microsoft is working on dual display for smartphones


టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ డిస్‌ప్లే సిస్టంను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ తరహా వినూత్న వ్యవస్ధను టాబ్లెట్ కంప్యూటర్లలో సైతం వ్యాపింప చేయాలని సంస్థ భావిస్తోంది. ఫోన్ వెనుక భాగంలో అదనంగా సెకండరీ డిస్‌ప్లేను ఏర్పాటు చెయ్యటమే డ్యూయల్ డిస్‌ప్లే సిస్టం ప్రధాన ఉద్దేశం.

తక్కువ శక్తిని కలిగి ఉండే సెకండరీ డిస్‌ప్లే, ప్రైమరీ స్ర్కీన్ పై చూపని సమాచారాన్ని మాత్రం ప్రదర్శిస్తుంది. వివిధ లోగోలతో పాటు టైమ్ ఇతర అన్‌రీడ్ సందేశాలు సెకండరీ డిస్‌ప్లే పై ప్రదర్శింపబడతాయి. బ్యాక్ ప్యానెల్ స్ర్కీన్ కోసం ప్రత్యేకించి ద్వితీయ శ్రేణి ప్రాసెసర్‌ను డివైజ్‌లో అమర్చటం జరుగుతుంది.

సెకండరీ డిస్‌ప్లే పై ప్రదర్శించబడే కంటెంట్ ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ఈ చర్యతో మెయిన్ స్ర్కీన్ అదేవిధంగా ప్రాధమిక ప్రాసెసర్‌లు స్లీప్ మోడ్‌లో ఉంటాయి. ఈ సెకండరీ అదే విధంగా తక్కువ శక్తి కలిగిన డిస్‌ప్లేలు బెండబుల్ తత్వాన్ని కలిగి కాంటౌర్ డిజైన్ బేరింగ్‌తో స్మార్ట్‌ఫోన్‌లలో అమర్చబడి ఉంటాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X