పుంజుకునేందుకు మరో పంజా..?

ప్రఖ్యాత మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా, ఆషా సిరీస్ నుంచి 202, 203 మోడళ్లలో రెండు మొబైల్ ఫోన్లను ఇండియాలో విడుదల చేసింది. వీటిలో ఆషా 202 డ్యూయల్ సిమ్ సౌలభ్యతను కలిగి ఉండగా, 203 కేవలం సింగిల్ సిమ్ నెట్వర్క్కే పరిమితమైంది. మార్కెట్లో ఆషా 202 ధర రూ.4,000. ఆషా సిరీస్ నుంచి విడుదలయ్యే ఫోన్లు బ్రాండ్ ఉనికుని మరింత పెంచుతాయని నోకియా వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఆషా 202 ప్రధాన ఫీచర్లు:
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
2.4 అంగుళాల టీఎఫ్టీ టచ్స్ర్కీన్ డిస్ప్లే,
2మెగా పిక్సల్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బ్యాటరీ స్టాండ్ బై 400 గంటలు.
గోల్డెన్ వైట్, డార్క్గ్రే, సిల్వర్ వైట్, బ్లాక్ అదేవిధంగా డార్క్రెడ్ కలర్ వేరియంట్లలో ఫోన్ లభ్యం కానుంది. ఈ ఫోన్ యూజర్లు నోకియా ఆప్లికేషన్ స్టోర్ ద్వారా 40 ఆటలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నోకియా సాధారణ హ్యాండ్ సెట్ నోకియా 103 ఫీచర్లు:
స్ర్కీన్ పరిమాణం 1.3 అంగుళాలు (రిసల్యూషన్ 96 x 68పిక్సల్స్),
ఫోన్ బరువు 76.6 గ్రాములు,
సిరీస్ 30 ఆపరేటింగ్ సిస్టం,
ఫోన్బుక్ సామర్ధ్యం (500 ఎంట్రీస్ వరకు),
నెట్వర్క్ సపోర్ట్ (2జీ),
ఆడియో ప్లేయర్,
గేమ్స్,
ఎఫ్ఎమ్ రేడియో,
లౌడ్ స్సీకర్,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
లియోన్ 800mAh బ్యాటరీ (స్టాండ్ బై 648గంటలు, టాక్ టైమ్ 11 గంటలు),
ధర అంచనా రూ.1300.


Click it and Unblock the Notifications