మార్కెట్లోకి ఓబీ ఆక్టోపస్ ఎస్520 స్మార్ట్ఫోన్
యాపిల్ కంపెనీ మాజీ సీఈఓ జాన్ స్కల్లీ అలానే భారత్కు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫ్లెక్సియోన్పాయింట్ సంయుక్త భాగస్వామ్యంతో నెలకొల్పబడిన ఓబీ మొబైల్స్ నుంచి ఓబీ ఆక్టోపస్ ఎస్520 పేరుతో సరికొత్త స్మార్ట్ఫోన్ గురువారం మార్కెట్లో విడుదలైంది. ప్రముఖ రిటైలర్ స్నాప్డీల్ ఈ 8 కోర్ సీపీయూ డివైస్ను రూ.11,990కి విక్రయిస్తోంది. ఫోన్ కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే....

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ప్లే,
ఆల్యూమినియమ్ బ్యాక్ ప్యానల్,
1.7గిగాహెట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (3జీ+3జీ),
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, 3జీ, బ్లూటూత్ 4.0, జీపీఎస్, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ),
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఆక్టోపస్ ఎస్520 స్మార్ట్ఫోన్ కొనుగోలు పై ఫ్లిప్ కవర్, స్ర్కీన్ ప్రొటెక్టర్, చార్జింగ్ కేబుల్ అలానే ఇయర్ ఫోన్లను కంపెనీ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








