బడ్జెట్ ధరకే బిగ్ బ్యాటరీ ఫోన్
పానాసోనిక్ అతి పెద్ద బ్యాటరీతో వచ్చిన సరికొత్త స్మార్ట్ఫోన్ ను లాంచ్ చేసింది.
పానాసోనిక్ అతి పెద్ద బ్యాటరీతో వచ్చిన సరికొత్త స్మార్ట్ఫోన్ ను లాంచ్ చేసింది. పీ55 మాక్స్ పేరుతో ఈఫోన్ ను బడ్జెట్ ధరలో సోమవారం లాంచ్ చేసింది. 5000 ఎంఏహెచ్ సామర్ధ్యంతో వచ్చిన ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.8,499 గా నిర్ణయించింది. జూలై 17 నుంచి ఫ్లిప్కార్ట్ లోప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

5000 ఎంఏహెచ్ సామర్ధ్యంతో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ద్వారా వాల్యూ బేస్డ్ సెగ్మెంట్లో వినియోగదారులకు నిరంతరాయ సేవలు అందుబాటులోకి తెచ్చామని పానసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్(మొబిలిటీ డివిజన్) పంకజ్ రాణా చెప్పారు. ఫీచర్ల విషయానికొస్తే..

డిస్ప్లే
5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్1.25 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ మీడియా టెక్ ప్రాసెసర్

ర్యామ్
3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీఎక్స్పాండబుల్ స్టోరేజ్

కెమెరా
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

బ్యాటరీ
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ నౌగట్ 7.0, ఈ ఫోన్ ప్లస్ పాయింట్ బ్యాటరీయేనని కంపెనీ చెబుతోంది.

ధర
ధరను కంపెనీ రూ.8,499 గా నిర్ణయించింది. జూలై 17 నుంచి ఫ్లిప్కార్ట్ లోప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.


Click it and Unblock the Notifications








