ఇండియా మార్కెట్లోకి లాంచ్ కానున్న షియోమి చవక ధర ఫోన్
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షియామి తన మొదటి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ఫోన్ అయిన Redmi Go ను ఫిలిప్పీన్స్ మార్కెట్లో జనవరిలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షియామి తన మొదటి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ఫోన్ అయిన Redmi Go ను ఫిలిప్పీన్స్ మార్కెట్లో జనవరిలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు షియోమి ఈ Redmi Go స్మార్ట్ఫోన్ ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్దమవుతుంది. ఈ నెల 19వ తేదీన ఈ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్టు షియోమి ప్రకటించింది.ఇందులో ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ ఓఎస్ను అందిస్తున్నారు. ఈ ఫోన్లో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్ను అందిస్తున్నారు. బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.
షియోమి ఇండియా హెడ్ మను కుమార్ జైన్ హిందీలో ఈ ఫోన్ యొక్క లాంచ్ టీజర్ ను ట్వీట్ చేసాడు
ఈ మేరకు షియోమి ఇండియా హెడ్ మను కుమార్ జైన్ హిందీలో ఈ ఫోన్ యొక్క లాంచ్ టీజర్ ను ట్వీట్ చేసాడు. టీజర్ ట్వీట్ లో microsite on Mi.com లింక్ కూడా ఉంది, ఆ పేజీలో అనేక మంది బిట్బిట్లు ఉన్నాయి, వీటిని కూడా Redmi Go ఫోన్ కు సూచించవచ్చు, వీటిలో Android Oreo (గో ఎడిషన్), క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ SoC మరియు HD డిస్ప్లే ఉన్నాయి. అలాగే హిందీ గూగుల్ అసిస్టెంట్ తో పాటు 20 ప్రాంతీయ భాషలకు మద్దతు ఇస్తుంది.

Redmi Go ధర
ఇప్పటివరకైతే షియోమి కంపెనీ ఈ ఫోన్ల యొక్క ధరలను ప్రకటించలేదు.అయితే ఈ ఫోన్ ధర సుమారు రూ.5,999 ఉండవచ్చు అని పుకార్లు వినిపిస్తున్నాయి.

ఫీచర్లు
5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








