జియో ఫోన్లు ఆపేస్తున్నారా, కంపెనీ సమాధానం ఏంటో తెలుసుకోండి !
ఉచిత ఆఫర్లు, ఫ్రీ డేటా ఆఫర్లతో ప్రత్యర్థి కంపెనీలకు గుబులు పుట్టించిన జియో తన ఇండియా కా స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ ఉత్పత్తి ఆపేస్తున్నదంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.
జియో ఫోన్ మీద రోజుకొక సంచలనపు వార్త బయటకొస్తోంది. ఉచిత ఆఫర్లు, ఫ్రీ డేటా ఆఫర్లతో ప్రత్యర్థి కంపెనీలకు గుబులు పుట్టించిన జియో తన ఇండియా కా స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ ఉత్పత్తి ఆపేస్తున్నదంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను జియో ఖండించింది. ఈ న్యూస్ మీద దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.

వార్తలను ఖండించిన రిలయన్స్ జియో
రూ.1,500 జియో 4జీ ఫీచర్ ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను రిలయన్స్ జియో ఖండించింది.

డిజిటల్ విజన్ సాకారానికి..
భారతదేశపు డిజిటల్ విజన్ సాకారానికి ఎల్లప్పుడూ చేయూతనందిస్తామని తెలిపింది. తొలి విడతలో 60 లక్షల జియో ఫోన్లను కొనుగోలు చేసిన కస్టమర్లను డిజిటల్ లైఫ్లోకి స్వాగతిస్తున్నామని పేర్కొంది.

త్వరలోనే రెండో విడత..
త్వరలోనే రెండో విడత జియో ఫోన్ బుకింగ్స్ తేదీని ప్రకటిస్తామని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్ను తీసుకురావడంపై..
కాగా జియో ఫీచర్ ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్ను తీసుకురావడంపై కసరత్తు చేస్తోందని ఈ మధ్యే వార్తలు వెలువడ్డాయి.

ఫేస్బుక్, వాట్సాప్లాంటి సోషల్మీడియా సైట్ల సపోర్టు..
జియో ఫీచర్ఫోన్లో ఫేస్బుక్, వాట్సాప్లాంటి సోషల్మీడియా సైట్ల సపోర్టు లేకపోవడంతో తాజాగా ఆండ్రాయిడ్ ఫోన్లను ఉచితంగా అందించనుందని, ఇందుకోసం అన్ని సోషల్ మీడియా యాప్ల మద్దతుతో ఈ ఉచిత ఆండ్రాయిడ్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానుందని వార్తలు షికార్లు చేశాయి.

ఫేస్బుక్, గూగుల్లాంటి సంస్థలతో..
ఈ ఫోన్ విషయంపై ఫేస్బుక్, గూగుల్లాంటి సంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు కూడా చేపట్టినట్టు నివేదించింది. కాని వాటిని జియో తోసిపుచ్చింది.

భవిష్యత్ లో ఆండ్రాయిడ్ ఫోన్ మీద..
అయితే భవిష్యత్ లో ఆండ్రాయిడ్ ఫోన్ మీద పనిచేస్తామనే సంకేతాలను మాత్రం అందించింది


Click it and Unblock the Notifications








