జియో మాన్సూన్ హంగామా ఆఫర్ ఆ ఫోన్కి మాత్రమే! నిజాలు తెలుసుకోండి
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ముంబైలో జరిగిన కంపెనీ 41 వార్షిక సమావేశంలో జియోఫోన్ 'మాన్సూన్ హంగామా' ఆఫర్ను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ముంబైలో జరిగిన కంపెనీ 41 వార్షిక సమావేశంలో జియోఫోన్ 'మాన్సూన్ హంగామా' ఆఫర్ను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ ఆఫర్ కింద వినియోగదారులు తమ వద్ద ఉన్న ఏదైనా పాత ఫీచర్ ఫోన్ ఇచ్చి కొత్తగా జియో ఫోన్ని కేవలం 501 రూపాయలకే పొందవచ్చని ముఖేష్ అంబానీ తెలిపారు. అయతే ఈ ఆఫర్ ఏ ఫోన్ కి వర్తిసుందో తెలియక గందరగోళం ఏర్పడింది. జియోఫోన్ 2కి కూడా వర్తిస్తుందా లేక జియోఫోన్ కి మాత్రమేనా అనేదానిపై అనేక సందేహాలు నెలకొని ఉన్న నేపథ్యంలో కంపెనీ దీనిపై క్లారిటీ ఇచ్చింది.

Reliance Jio Monsoon Hungama offer..
కంపెనీ కొత్తగా జియోఫోన్ 2ను ఆవిష్కరించిన నేపథ్యంలో కంపెనీ ఇచ్చిన Reliance Jio Monsoon Hungama offer ఈ ఫోన్ కు కూడా వర్తిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అది ఈ ఫోన్ కి వర్తించదని కంపెనీ స్పష్టం చేసింది.

మార్కెట్లో లభ్యమవుతున్న జియోఫోన్పై
మాన్సూన్ హంగామా ఆఫర్ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న జియోఫోన్పై అని కంపెనీ క్లారిటీ ఇచ్చింది.

రూ.501 చెల్లిస్తే ..
ఏదైనా పాత ఫీచర్ ఫోన్ను ఇచ్చి రూ.501 చెల్లిస్తే జియోఫోన్(ప్రస్తుతం మార్కెట్లో ఉన్నది) కొనుగోలు చేయవచ్చని జియో ప్రతినిధులు ప్రకటించారు.

జూలై 21 న అందుబాటులోకి
జియో మాన్సూన్ హంగామా ఆఫర్ జూలై 21 న అందుబాటులోకి రానుందని తెలిపారు. కంపెనీ ఇచ్చిన క్లారిటీతో జియోఫోన్పై ఏర్పడిన గందరగోళం వీడింది. దీనిపై గందరగోళం ఏర్పడటంతో, కొంతమంది వినియోగదారులు జియో స్టోర్లలో ప్రతినిధులను ఆరా తీశారని సమాచారం.

ఆగస్టు 15 నుంచి..
ఆగస్టు 15 నుంచి ప్రస్తుతమున్న జియోఫోన్లోనూ వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది.

రూ.2,999కే ..
కాగా, కంపెనీ కొత్తగా ప్రకటించిన జియోఫోన్2 ఆగస్టు 15 నుంచి మార్కెట్లోకి రానుంది. ప్రారంభ ఆఫర్ కింద దీనిని రూ.2,999కే విక్రయించనున్నారు.

జియోఫోన్ 2 బెస్ట్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు



Click it and Unblock the Notifications








