ఇది విన్నారా.. 3వేలకే శామ్సంగ్ స్మార్ట్ఫోన్!!

స్మార్ట్ఫోన్ల తయారీ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న శామ్సంగ్ తాజాగా భారతీయ మొబైల్ ఫోన్ మార్కెట్ను టార్గెట్ చేసింది. అన్ని వర్గాల వినియోగదారులను ఆకర్షించే క్రమంలో చవకైన స్మార్ట్ గ్యాడ్జెట్లను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. సాధారణ వర్గాలు మొదులకుని ఉన్నత స్థాయి వరకు అందరికి అందుబాటులో ఉండే విధంగా భిన్న వేరియంట్లలో స్మార్ట్ఫోన్లను శామ్సంగ్ డిజైన్ చేసింది. దేశంలో అత్యంత ప్రజాదరణను సొంతం చేసుకున్న ‘గెలక్సీ Y’ సిరీస్ ఫోన్లు రూ.7,000 ప్రారంభ ధర నుంచి లభ్యమవుతున్నాయి. భారతీయులకు మరింత దగ్గరయ్యే క్రమంలో శామ్సంగ్ రూ.3000లకే ఉత్తమ స్పెసిఫికేషన్లతో కూడిన స్మార్ట్ఫోన్లను అందించనుంది.


Click it and Unblock the Notifications







