వావ్!! శ్యామ్‌సంగ్ ఇంటర్నెట్ ఫోన్ రూ.2,500కే..?

By Prashanth
|
Samsung E2600


వివిధ మార్కెట్ సెగ్మంట్‌ల పై దృష్టి సారించిన శ్యామ్‌సంగ్ తక్కువ ఖరీదుకే మన్నికైన మొబైల్ ఫోన్‌లను అందించేందుకు సమాయుత్తమవుతోంది. ఈ క్రమంలో స్టాండర్డ్ అదేవిధంగా ఆడ్వాన్సడ్ ఫీచర్లతో ‘శ్యామ్‌సంగ్ E2600’ మొబైల్ ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది.

జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌ను ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నెట్ బ్రౌజింగ్ వ్యవస్థను నిక్షిప్తం చేశారు. పొందుపరిచిన జీజీఆర్ఎస్, ఎడ్జ్ అప్లికేషన్‌లు ఇంటర్నెట్ వేగాన్ని పెంచుతాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ డిస్‌ప్లే 2.4 అంగుళాలు (టీఎఫ్టీ టచ్ స్ర్కీన్ స్వభావం కలిగి ఉంటుంది), 2.0 మెగా పిక్సల్ కెమెరా, 40 ఎంబీ ఇంటర్నల్ మెమరీ, జీబి స్ధాయిని 16 స్థాయికి పెంచుకునే విధంగా మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్.

ఫోన్ డేటాను వేగవంతంగా షేర్ చేసుకునేందుకు బ్లూటూత్ v3.0 A2DP, యూఎస్బీ 2.0 పోర్ట్ కనెక్టువిటీలు దోహదపడతాయి. ఏర్పాటు చేసిన ఎఫ్ఎమ్ రేడియో వ్యవస్థ అలుపెరగని వినోదాన్ని పంచుతుంది. ముందుగానే లోడ్ చేసిన్ గేమ్స్ అలసటకు దూరం చేస్తాయి.

మన్నికైన బ్యాకప్ నిచ్చే 800 mAh రిమూవబుల్ లితియయ్ ఐయాన్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో విడుదలకాబోతున్న ‘శ్యామ్‌సంగ్ E2600’ ధర రూ.2,500 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X