నేడు ఇండియా మార్కెట్లో లాంచ్ కానున్న శాంసంగ్ మూడు కెమెరాల ఫోన్
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన లేటెస్ట్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎ7 (2018) ను ఈ రోజు ఇండియా మార్కెట్ లోకి విడుదల చేయనుంది.
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన లేటెస్ట్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎ7 (2018) ను ఈ రోజు ఇండియా మార్కెట్ లోకి విడుదల చేయనుంది. శాంసంగ్ ఏ సిరీస్లో ఆకట్టుకునే ఫీచర్లతో ముఖ్యంగా భారీ డిస్ప్లే, మూడు రియర్కెమెరాలతో లేటెస్ట్ వెర్షన్గా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. బ్లూ, బ్లాక్, గోల్డ్ , పింక్ కలర్స్లో లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర పై ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ రూ.30,000 లోపు ఉండవచ్చు అని పుకార్లు వినిపిస్తున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎ7( 2018) ఫీచర్లు...
6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,ఆండ్రాయిడ్ 8.0 ఓరియో,4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 512 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్,24+8+5 ఎంపీ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,24 ఎంపీ సెల్ఫీ కెమెరా,side-mounted fingerprint sensor,FM radio, Bluetooth 5.0, Wi-Fi, 4G with VoLTE, USB 2.0 ,3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

భారీ డిస్ప్లే....
గెలాక్సీ ఎ7(2018) స్మార్ట్ఫోన్లో 6 ఇంచుల భారీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు.4 జీబీ / 6 జీబీ పవర్ఫుల్ ర్యామ్ను ఏర్పాటు చేయడం వల్ల ఫోన్ మెరుగైన ప్రదర్శనను ఇస్తుంది.

వెనుక భాగంలో మూడు కెమెరాలు...
ఈ ఫోన్ వెనుక భాగంలో 24,8, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న మూడు కెమెరాలను ఏర్పాటు చేయగా, ముందు భాగంలో 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా విత్ LED ఫ్లాష్ ఉంది. వీటితో తీసుకునే ఫొటోలు, వీడియోలు క్వాలిటీని కలిగి ఉంటాయి.

ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం....
గెలాక్సీ ఎ7 (2018) స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే 3300 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ను కలిగి ఉంటుంది.

సాఫ్ట్వేర్, హార్డ్వేర్....
అలాగే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ పరంగా ఇది మంచి పనితీరును కనపరుస్తోంది.,2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ తో ఈఫోన్ రాబోతుంది . ఇది వేగవంతమైన పనితీరును అందిచబోతుంది .Side-mounted fingerprint sensor,FM radio, Bluetooth 5.0, Wi-Fi, 4G with VoLTE, USB 2.0 అదనపు ఆకర్షణలు.


Click it and Unblock the Notifications








