Galaxy C7 Pro 4జిబి ర్యామ్ స్మార్ట్ఫోన్ ధర తగ్గింపు
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ గతేడాది రిలీజ్ చేసిన మిడ్ ఎండ్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy C7 Pro ధరను ఇండియాలో తగ్గించింది.
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ గతేడాది రిలీజ్ చేసిన మిడ్ ఎండ్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy C7 Pro ధరను ఇండియాలో తగ్గించింది. తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ఫోన్ రూ. 22,400కే లభిస్తోంది. అమెజాన్ లో ఈ స్మార్ట్ఫోన్ ధర ఇంతకుముందు రూ.27,990 ఉండగా ఇప్పుడు అది రూ. 22,400కు లభిస్తోంది. కాగా ఈఫోన్ లాంచింగ్ టైం నుండి ఇండియా మార్కెట్లో ఇది రెండో సారి ధర తగ్గడం. కాగా ఈ విషయాన్ని తొలిసారిగా ముంబై బేస్ డ్ రీటెయిలర్ మహేష్ టెలికాం రిపోర్ట్ చేసింది.

మెటల్ యూనీబాడీ 2.5D curved glass coatingతో పాటు 5.7-inch Full HD Super AMOLED displayతో ఫోన్ వచ్చింది. ఫోన్ రిజల్యూషన్ విషయానికొస్తే 1080 x 1920 pixels. ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్ తో పాటు 6జిబి ర్యామ్ 64 జిబి ఇంటర్నల్ మెమొరీని పొందుపరిచారు. మైక్రో ఎస్డీ ద్వారా 256 జిబి వరకు విస్తరించుకునే సామర్ధ్యం ఉంది. కాగా కంపెనీ నుంచి అతి త్వరలో Galaxy A6 and A6+ ఫోన్లు రానున్న నేపథ్యంలో ఈ ఫోన్ ధరను తగ్గించినట్లు తెలుస్తోంది.
పూర్తి ఫీచర్ల విషయానికొస్తే..
గెలాక్సీ సీ7 ప్రో టెక్నికల్ ఫీచర్స్.. 5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్మల్లో ఆపరేటింగ్ సిస్టం, 2.2 GHz ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.


Click it and Unblock the Notifications