సామ్సంగ్ కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది, ఫ్లిప్కార్ట్లో మాత్రమే..
Galaxy On Nxt పేరుతో సరికొత్త స్మార్ట్ఫోన్ను సామ్సంగ్ ఇండియా శుక్రవారం మార్కెట్లో లాంచ్ చేసింది.
Galaxy On Nxt పేరుతో సరికొత్త స్మార్ట్ఫోన్ను సామ్సంగ్ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ శుక్రవారం మార్కెట్లో అనౌన్స్ చేసింది. ధర రూ.18,490. అక్టోబర్ 24 నుంచి Flipkart ఈ ఫోన్లను ఎక్స్క్లూజివ్గా విక్రయించబోతోంది. గోల్డ్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఫోన్ ప్రత్యేకతలు ఈ విధంగా ఉన్నాయి...

Read More : జియో ఎఫెక్ట్ : 10జీబి 4జీ డేటా పూర్తిగా ఉచితం!
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్ప్లే, 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్ర్కీన్, ఫుల్ మెటల్ యునిబాడీ డిజైన్, ఆండ్రాయిడ్ మార్ష్మల్లో వర్షన్ ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెర్ట్జ్ ఎక్సినోస్ 7870 ప్రాసెసర్.

Read More : ఇక సామ్సంగ్ నుంచి 4G VoLTE ఫోన్లు మాత్రమే వస్తాయ్!
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఆప్షన్స్ (4జీ ఎల్టీఈ, 3జీ, బ్లుటూత్ 4.1, జీపీఎస్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ), 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








