Galaxy S9, S9 plusలపై Airtel బంపరాఫర్, రూ.9900కే ఫోన్ సొంతం !
శాంసంగ్ అభిమానులకు ఎయిర్టెల్ పెద్ద శుభవార్తను అందించింది. శాసంగ్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్లు Galaxy S9, S9 Plusలను ఇకపై యూజర్ల ఎయిర్ టెల్ షోరూంలో కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ అభిమానులకు ఎయిర్టెల్ పెద్ద శుభవార్తను అందించింది. శాసంగ్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్లు Galaxy S9, S9 Plusలను ఇకపై యూజర్ల ఎయిర్ టెల్ షోరూంలో కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు కంపెనీ నుంచి ప్రకటన వెలువడింది. అంతేకాదు కంఫర్టబుల్ డౌన్పేమెంట్, ఈఎంఐ సదుపాయాలను కూడా అందిస్తోంది. ఇందులో కొనుగోలుదారులు తమ బడ్జెట్కు అనుకూలమైన డౌన్ పేమెంట్ను ఎంపి కచేసుకోవచ్చు. దీంతోపాటుగా ఎయిర్టెల్ ఒక ఆసక్తికర ఆఫర్ను కూడా అందించనుంది. మరి ఆ ఆఫర్ విశేషాలపై ఓస్మార్ట్ లుక్కేయండి.

రూ.9,900 డౌన్ పేమెంట్..
గెలాక్సీఎస్ 9.. 64జీబీ వేరియంట్ రూ.9,900 డౌన్ పేమెంట్ ఆప్షన్, తర్వాత 24నెలవారీ వాయిదాలలో రూ.2,499 చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తోంది. గెలాక్సీ ఎస్9 + 64జీబీ వేరియంట్ను కేవలం రూ .9,900 డౌన్పేమెంట్ చేసి సొంతం చేసుకోవచ్చు. తదుపరి 24 నెలవారీ వాయిదాలలో రూ. 2,799. చెల్లించే అవకాశం.

ఈ రెండు స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై
అంతేకాదు ఈ రెండు స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై 8జీబీ డేటా, అపరిమిత కాలింగ్, ఒక సంవత్సరం అమెజాన్ ప్రధాన సభ్యత్వం, ఎయిర్టెల్ సెక్యూర్, ఎయిర్టెల్ టీవీ, విన్క్ మ్యూజిక్ వంటి ఉత్తేజకరమైన కంటెంట్ను అందించే పోస్ట్పెయిడ్ ప్లాన్ కూడా ఉచితంగా అందిస్తోంది.

ధర
అయితే ఈ నెలలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన గెలాక్సీ ఎస్ 9 ధర రూ. 57,900. ఎస్ 9 ప్లస్ కు రూ. 64,900 ప్రారంభ ధరగా నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఆన్లైన్ స్టోర్లో..
కాగా తమ ఆన్లైన్ స్టోర్లో తాజా శాంసంగ్ స్మార్ట్ఫోన్లను అందించడం ఆనందంగా ఉందని అధికారి భారతి ఎయిర్టెల్ ప్రధాన మార్కెటింగ్ ముఖ్యఅధికారి వాణి వెంకటేష్ ప్రకటించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం ఈ ప్రీమియం మొబైల్ను తక్షణ ఫైనాన్సింగ్ ద్వారా అందించనున్నామన్నారు.


Click it and Unblock the Notifications








