రూ.11,490కే సామ్సంగ్ కొత్త స్మార్ట్ఫోన్
ఆక్టా కోర్ ప్రాసెసర్, 256జీబి ఎక్స్టర్నల్ స్టోరేజ్..
బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ మార్కెట్ పై తిరిగి పట్టు సాధించే క్రమంలో సామ్సంగ్ సరకొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ముంబైకు చెందిన ప్రముఖ రిటైలర్ మహేష్ టెలికామ్ వెల్లడించిన వివరాల ప్రకారం Galaxy J7 Nxt పేరుతో సరికొత్త స్మార్ట్ఫోన్ను సామ్సంగ్ లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్ ధర రూ.11,490గా ఉంటుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ హైడెఫినిషన్ డిస్ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ సామ్సంగ్ టచ్విజ్ యూజర్ ఇంటర్ఫేస్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్స్ (4జీ ఎల్టీఆ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 3,000 mAh బ్యాటరీ.బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్స్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. సామ్సంగ్ S-Bike, ultra-data సేవింగ్, Ultra Power సేవింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్తో ఇన్బిల్ట్గా వస్తున్నాయి.


Click it and Unblock the Notifications








