‘శామ్సంగ్ S5222’ అత్యుత్తమ డ్యూయల్ సిమ్ ఫోన్!!

ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రజాదరణను అందుకుంటున్న ‘శామ్సంగ్’ సరికొత్త ఆండ్రాయిడ్ ఆధారిత డ్యూయల్ సిమ్ మొబైల్ను ప్రవేశపెట్టనుంది. ‘శామ్సంగ్ ఎస్5222’ మోడల్లో వస్తున్న ఈ స్మార్ట్ డివైజ్ సౌకర్యవంతమైన మొబైలింగ్కు ఉపకరిస్తుంది. రెండు నెట్వర్క్లను సపోర్ట్ చేసే ఈ డ్యూయల్ సిమ్ఫోన్ నిక్కార్సైన పనితనాన్ని కలిగి ఉంటుంది.
ఫోన్ ముఖ్య ఫీచర్లు:
* 3 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ప్లే, * 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, * అన్ లిమిటెడ్ ఫోన్బుక్, * అన్ లిమిటెడ్ కాల్ రికార్డ్స్, * 1జీబి ఇంటర్నల్ మెమెరీ, * 512 ఎంబీ ర్యామ్, * 16జీబి ఎక్స్టర్నల్ మెమెరీ, * మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, * 3జీ కనెక్టువిటీ, * వై-ఫై, * బ్లూటూత్, * యూఎస్బీ కనెక్టువిటీ, * జీఎస్ఎమ్ నెట్వర్క్ సపోర్ట్, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, గేమ్స్ * ఆండ్రాయిడ్ v2.1 ఆపరేటింగ్ సిస్టం, * 1 GHz కార్టెక్స్ ఏ-8 ప్రాసెసర్, * బ్యాటరీ స్టాండ్బై టైమ్ 350 గంటలు.
త్వరలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్లలో లభ్యంకానున్న ‘శామ్సంగ్ S5222’ ధర ఇండియన్ మార్కెట్లో రూ.8,000 ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా.


Click it and Unblock the Notifications








