‘లక్ష్మీ’కి మార్కెట్లో ఎమ గిరాకీ..!!

బెంగుళూరు కంపెనీ అయిన లక్ష్మీకమ్యూనికేషన్స్ అత్యాధునిక సాంకేతిక పరికాలను సమంజసమైన ధరలకు అందించేందుకు కృషిచేస్తుంది. విడుదల కాబోతున్న ‘మిర్చీ 5’ విశేషాలను పరిశీలిస్తే 5 అంగుళాల డిస్ ప్లే కలిగిన స్ర్కీన్, ‘డెల్ స్ట్రీక్’ మొబైల్ పోలిక కలిగి ఉంటుంది. 1GHz సామర్థ్యం కలిగిన సీపీయూ, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థ, 512 ఎంబీ స్టోరేజి కెపాసిటీ, 512 ఎంబీ సామర్ధ్యం కలిగిన ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా వంటి అంశాలు వినియోగదారునికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.
ప్రత్యేక ఫీచర్లను పరిశీలిస్తే ఎఫ్ఎమ్ రేడియో యుటిలిటీ, లైట్ సెన్సార్, ఇ - కంపాస్, యాక్సిలరోమీటర్, ఆటో రొటేట్ వంటి అంశాలు ఆధునిక వ్యవస్థతో రూపొందించారు. పొందుపరిచిన బ్లూటూత్ డివైజ్ డాటా ట్రాన్స్ఫర్ను మరింత వేగవంతంగా నడిపిస్తుంది. పొందుపరిచిన అపడేటడ్ వై - ఫై వ్యవస్థ పటిష్టమైన కనెక్టువిటీ కలిగి ఉంటుంది. ఇక మార్కెట్ విషయానికి వస్తే ఎల్జీ ఆప్టిమస్, హెచ్ టీసీ, మైక్రో మ్యాక్స్, శ్యామ్ సంగ్, స్పైస్ వంటి బ్రాండ్ల నుంచి లక్ష్మికి గట్టి పోటీ ఎదురవనుంది. అయితే ‘మిర్చీ 5’ మార్కెట్ ధర రూ.20,000 ఉండవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications







