‘సోని’ తాజా అప్డేట్ ఎవరికి వర్తిస్తుంది...?

ఎస్ ( S), పీ (P) వేరియంట్లలో సోని విడుదల చేసిన టాబ్లెట్ పీసీల ఆపరేటింగ్ సిస్టం మార్పునకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టంను ఈ రెండు మోడళ్ల టాబ్లెట్ పీసీలో నిక్షిప్తం చేయునున్నట్లు సమాచారం. ఇప్పటికే మార్కెట్లో విడుదలైన ‘సోని ఎస్’ ఆండ్రాయిడ్ 3.1 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుండగా, ‘సోని పీ’ ఆండ్రాయిడ్ 3.2 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోంది. ఈ తాజా అప్డేట్ కొత్త ఏడాది నుంచి అమలులోకి రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Best Mobiles in India


Click it and Unblock the Notifications








