స్పైస్ నుంచి చవక ధర డ్యుయల్ సిమ్ స్మార్ట్ఫోన్
ఇంటెక్స్.. లావా.. కార్బన్ వంటి దేశవాళీ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలు తమతమ లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లో విడుదల చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ కోవకే చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ స్పైస్, స్మార్ట్ ప్లో క్రిస్టల్ ఎమ్ఐ-449 (Smart FloCrystal Mi-449) పేరుతో సరికొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.4,999. ప్రముఖ రిటైలర్Homeshop18 ఈ స్మార్ట్ఫోన్ను రూ.4,999కి విక్రయిస్తోంది. ఫోన్ కొనుగోలు పై ఉచిత స్మార్ట్ ఫ్లిప్ కవర్ను ఈ రిటైలర్ ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించి కీలక స్పెసిఫికేషన్లను పరిశీలించినట్లయితే....

4.5 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
ఐపీఎస్ డిస్ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెర్,
512ఎంబి ర్యామ్,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునేు సౌలభ్యత,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
కనెక్టువిటీ ఫీచర్లు 2జీ (ఎడ్జ్), వై-ఫై 802.11 బీజీఎన్, బ్లూటూత్, ఏజీపీఎస్,
1450ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








