స్పైస్ నుంచి చవక ధర డ్యుయల్ సిమ్ స్మార్ట్ఫోన్

నోయిడా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దేశవాళీ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ స్పైస్ మొబిలిటీ ‘స్మార్ట్ఫ్లో మిట్టిల్ 3.5ఎక్స్' (ఎమ్ఐ-536) పేరుతో చవక ధర డ్యుయల్ సిమ్ ఆండ్రియిడ్ స్మార్ట్ఫోన్ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్సైట్ Saholic ఈ స్మార్ట్ఫోన్ను రూ.3,549కి ఆఫర్ చేస్తోంది.
ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే......
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్),
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు 2జీ (ఎడ్జ్), బ్లూటూత్ విత్ ఏ2డీపీ, వై-ఫై,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
వైట్ కలర్ వేరియంట్లో మాత్రమే ఈ ఫోన్ లభ్యమవుతోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








