TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
'ఐఫోన్ 4ఎస్' రాక మార్కెట్లో ఓ సంచలనం..
ఇటీవల కాలంలో ప్రముఖ సర్వే సంస్ద రాయ్టర్స్ విడుదల చేసిన సర్వే ప్రకారం అటు టోక్యో నుంచి ఇటు శాన్ఫ్రాన్సిస్కో వరకూ స్మార్ట్ఫోన్లను వాడుతున్న ప్రతి నలుగురిలో ఒకరు తమ ఫోన్ను అప్గ్రేడ్ చేసుకొవడానికి ఇష్టపడుతున్నారు. దీంతో బ్లాక్ బెర్రీ ఫోన్లకు గండిపడుతుంది. యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ తదితర దేశాల్లో రాయ్టర్స్ సర్వే నిర్వహించింది. 'నేను ఇంతకుముందు వరకూ నోకియాను వాడాను. ఆ ఫోన్ వాడేటప్పుడు అది పూర్తిగా నా అవసరాలు తీర్చలేకపోతోంది అని అనిపిస్తుండేది. దీనికితోడు నా మిత్రులంతా యాపిల్ మొబైల్ ఫోన్లనే వాడుతున్నారు. దీంతో నేనూ యాపిల్కు మారా' అని సిడ్నీలో ఐఫోన్ను కొనుగోలు చేసేందుకు వచ్చిన 25 యేళ్ళ మైల్స్ గీజ్లర్ వ్యాఖ్యానించారు.
ఇక యాపిల్ ఐఫోన్ విడుదలైన రోజునే 10 లక్షలకు పైగా యూనిట్లు అమ్మకాలు జరుపుకున్నాయి. వారం రోజుల క్రితం ఆన్లైన్లో అమ్మకానికి వచ్చినప్పుడు మొత్తం 40 లక్షల యూనిట్లకు ఆర్డర్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏడు దేశాల్లో శుక్రవారం స్టోర్స్లలో ఐఫోన్ 4ఎస్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐఫోన్ శ్రేణిలోని ఫోన్లకు ఒక్క గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్లు మాత్రమే పోటీని ఇచ్చేలా కనిపిస్తున్నాయి. యాపిల్తో పోటీ పడడంలో తన అశక్తతను అర్ధం చేసుకున్న నోకియా ఇప్పటికే పాత ఆపరేటింగ్ సిస్టమ్ను వదిలి మైక్రోసాఫ్ట్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కొత్త ఐఫోన్ చూడటానికి అంతకుముందు విడుదలైన ఐఫోన్లానే కనిపించినా, వేగవంతమైన ప్రాసెసర్, అధిక మెగాపిక్సల్ కెపాసిటీ గల కెమెరా, సిరి పేరిట సరికొత్త వాయిస్ యాక్టివేటెడ్ సాఫ్ట్వేర్ వంటి సదుపాయాలు దీన్ని మరింత ఆకర్షణీయం చేశాయి.