రూ.3,999కే స్వైప్ 4జీ ఫోన్
ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్...
ఇండియన్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ స్వైప్ తన ఎలైట్ సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. స్వైప్ ఎలైట్ 4జీ పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.3,999. ఫ్లిప్కార్ట్లో మాత్రమే ఈ ఫోన్ లభ్యమవుతుంది.

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్టెడ్ డిస్ప్లేతో వస్తోన్న ఈ స్మార్ట్ఫోన్ 4G LTE విత్ VoLTE కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్..5 అంగుళాల FWVGA డిస్ ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.3GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2500mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో పోర్ట్, మైక్రో యూఎస్బీ 2.0 పోర్ట్, 3జీ, 4జీ.


Click it and Unblock the Notifications








