ఎంటీఎస్ బ్రాండ్ కింద దేశవ్యాప్తంగా టెలికామ్ సేవలందిస్తున్న సిస్టమ్ శ్యామ్ టెలీ సర్వీసెస్ లిమిటెడ్ (ఎస్ఎస్టీఎల్) స్వాతంత్ర్య దినోత్సవాన్నిపురస్కరించుకుని స్పెషల్ ఆఫర్ను ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా ఈ బ్రాండ్కు 1.6కోట్ల మంది యూజర్లున్నారు. స్పెషల్ ఆఫర్ కింద్ ఎంటీఎస్ ప్రవేశపెట్టిన రీచార్స్ వోచర్ విలువ రూ.68. పొందే టాక్టైమ్ విలువ రూ.75, అదనంగా 68 ఉచిత సందేశాలు (ఏ నెట్వర్క్ కైనా పంపుకోవచ్చు). ఆఫర్ ఈ నెల31వరకు చెల్లుబాటవుతుంది. ఈ సందర్భంగా ఎంటీఎస్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ సేల్స్ అధికారి లియోనిడ్ ముసాటోవ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన స్పెషల్ రీచార్జ్ ఆఫర్ తమ వినియోగదారులకు స్వేచ్చతో కూడిన అనుభూతులను మిగుల్చుతుందని అన్నారు. స్పెషల్ టారిఫ్తో కూడిన రీచార్జ్ ఔచర్ను ఎంటీఎస్ స్టోర్ల ద్వారా పొందవచ్చని ఆయన తెలిపారు.