మాట్లాడుతున్న కొద్దీ ఛార్జింగ్ అయ్యే మొబైల్

ఈ పరిశోధనలకు నాయకత్వం వహించిన డాక్టర్ సాంగ్ వూ కిమ్ తమ పరిశోధన వివరాలను వెల్లడి చేస్తూ పర్యావరణం నుంచి విద్యుత్ను ఉత్పాదనకోసం అనేక ప్రక్రియలపై శోధించామన్నారు.
‘శబ్దం మన జీవితంలో, పర్యావరణంలో అన్ని వేళలా ఉంటుందని, అయితే దానిని మనం వనరుగా భావించటం లేదని’ అన్నారు. శబ్దంతో మొబైల్ ఫోన్లకు అవసరమైన విద్యుత్ను ఉత్పత్తి చేయటంతో పాటుగా, హైవేల కిరువైపుల శబ్ద గ్రాహ్యకాలను అమర్చి వాహనాల నుంచి వెలువడే శబ్దంతో విద్యుత్ను పుట్టించ వచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో జింక్ ఆకై్సడ్తో కూడిన అతిచిన్న తీగ చుట్టలను రెండు ఎలక్ట్రోడ్ల మధ్య అమర్చుతారు.
దానిపైన పలుచని శబ్ద గ్రాహ్యకాలను ఉంచుతారు. శబ్ద తరంగాలు శబ్ద గ్రాహ్యకాన్ని డీకొనటంతో కంపనాలు ఉత్పత్తి అయి జింక్ ఆకై్సడ్ తీగలు కుచించుకపోయి విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. ఇదే రీతిలో ట్రాఫిక్ నుంచి ఉత్పత్తి అయిన 100 డెసిబిల్స్ శబ్ద తీవ్రత నుంచి 50 మిల్లీ వోల్ట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని ఇంజనీర్లు తెలిపారు. అయితే ఈ తరహాలో ఉత్పత్తి చేసిన విద్యుత్ ఒక మొబైల్ ఫోన్కు సరిపోదని తీగలను మార్చటం వల్ల మరింత విద్యుత్ను ఉత్పత్తిచేయవచ్చని కిమ్ తెలిపారు.


Click it and Unblock the Notifications








