ఇండియన్లకు పిచ్చి పిచ్చిగా నచ్చిన మొబైల్ ఇదే !
ఇండియాలో స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజు రోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రపంచ మొబైల్ కంపెనీల చూపు ఇండియా మీద పడింది. ప్రపంచ టాప్ దిగ్గజాలు ఇండియా మార్కెట్ మీద కన్నేశాయి.
ఇండియాలో స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజు రోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రపంచ మొబైల్ కంపెనీల చూపు ఇండియా మీద పడింది. ప్రపంచ టాప్ దిగ్గజాలు ఇండియా మార్కెట్ మీద కన్నేశాయి. అమెరికా దిగ్గజం ఆపిల్ అలాగే చైనా దిగ్గాలు, దక్ష కొరియా దిగ్గజాలు, జపాన్ కంపెనీలు దేశీయ మార్కెట్లోకి రోజు రోజుకి కొత్త కొత్త ఫీచర్లతో మొబైల్స్ ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. అయితే మార్కెట్లో ఎన్ని రకాల కంపెనీలు హల్ చల్ చేసినప్పటికీ కేవలం రెండు మూడు కంపెనీలు మాత్రమే ఇండియా మార్కెట్లో దూసుకుపోతున్నాయి. దేశీయ కంపెనీలు కనీసం పోటీలో కూడా లేవు. ముఖ్యంగా చైనా కంపెనీలు అయితే ఇండియా మార్కెట్లో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నాయి. ఈ శీర్షికలో భాగంగా ఇండియాలు ఇప్పుడు అధికంగా ఇష్టపడుతున్న మొబైల్ కంపెనీ గురించి ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

స్మార్ట్ఫోన్ కొనాలనుకునే ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు..
స్మార్ట్ఫోన్ కొనాలనుకునే ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు.. అన్ని ఫీచర్లతో బడ్జెట్ ధరలో అంటే 10 - 15 వేల రూపాయల మధ్య లభించే స్మార్ట్ఫోన్కే తమ ఓటు అంటున్నట్లు సర్వేలు వెల్లడిస్తుతున్నాయి.

మోస్ట్ ప్రిఫరబుల్ బ్రాండ్గా షావోమీ ఫోన్లు...
మధ్యస్థాయి వినియోగదారుల మోస్ట్ ప్రిఫరబుల్ బ్రాండ్గా షావోమీ ఫోన్లు ముందు వరుసలో నిలిచాయంటున్నారు నిపుణులు. ‘కన్జ్యూమర్ లెన్స్' నిర్వహించిన సర్వేలో ‘షియోమీ' భారతీయుల మోస్ట్ ప్రిఫరబుల్ బ్రాండ్గా నిలిచింది.

తరువాతి వరుసలో శాంసంగ్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లున్నాయి...
తరువాతి వరుసలో శాంసంగ్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లున్నాయి.ఎక్కువ మంది మొదటిసారి కొన్న స్మార్ట్ఫోన్తో పోలిస్తే.. రెండోసారి, మూడోసారి మాత్రం ఎక్కువ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ఫోన్ను కోనేందుకు ఇష్టపడుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది.

స్మార్ట్ఫోన్లు వాడుతున్న ప్రతి ముగ్గురు భారతీయుల్లో...
అయితే స్మార్ట్ఫోన్లు వాడుతున్న ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు హై ఎండ్ స్మార్ట్ఫోన్ను కొనాలనుకుంటుండగా.. ఐదుగురిలో నలుగరు ప్రస్తుతం వాడుతున్న ఫోన్తోనే అడ్జస్ట్ అవుతున్నట్లు ఈ సర్వేలో తెలిసింది.

వన్ప్లస్ బ్రాండ్ను...
అంతేకాక 25 - 40 వేల రూపాయల మధ్య ఫోన్ కొనాలని భావించే వాళ్లు ఎక్కువగా వన్ప్లస్ బ్రాండ్ను ప్రిఫర్ చేస్తున్నట్లు తెలిసింది. ఒప్పో, వివో, ఆపిల్, హనర్ వంటి హై బడ్జెట్ బ్రాండెడ్ ఫోన్లకు గట్టి పోటీనిస్తూ వన్ప్లస్ ముందు వరుసలో ఉంది.


Click it and Unblock the Notifications








