షియోమి తొలి బెజెల్ లెస్ స్మార్ట్ఫోన్ వచ్చేసింది
చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారి షియోమి తన బెజెల్ లెస్ స్మార్ట్ఫోన్ ఎంఐ మిక్స్2ను భారత్లోకి విడుదల చేసింది.
చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారి షియోమి తన బెజెల్ లెస్ స్మార్ట్ఫోన్ ఎంఐ మిక్స్2ను భారత్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.35,999గా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్ ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లోనే అందుబాటులో ఉంచుతోంది. గత నెలలో ఈ ఫోన్ను చైనాలో విడుదల చేసిన విషయం విదితమే. కంపెనీ నుంచి విడుదలైన తొలి బెజెల్ లెస్ స్మార్ట్ఫోన్ ఇదే కావడం విశేషం. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

ఎంఐ మిక్స్2 ఫీచర్లు
5.99 అంగుళాల డిస్ప్లే
2.4 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్
6జీబీ/8జీబీ ర్యామ్
64జీబీ/128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
12 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్
3400 ఎంఏహెచ్ బ్యాటరీ
4జీ, వాయిస్ఓవర్ ఎల్టీఈ


Click it and Unblock the Notifications








