Xiaomi నుంచి 8జీబి ర్యామ్ ఫోన్ వచ్చేస్తోంది, ధర రూ.25000లే!
స్మార్ట్ఫోన్ మార్కెట్లో నిత్యం సరికొత్త సంచలనాలకు తెరలేపుతోన్న Xiaomi మరో విప్లవాత్మక లాంచ్కు రెడీ అవుతోన్నట్లు సమాచారం.

Read More : Jio 4G.. 10 లాభాలు
చైనా బ్రాండ్ Xiaomi ఈ నెల 27న తన Mi 5s ఫోన్ను ప్రపంచానికి పరిచయం చేయబోతోన్న విషయం తెలిసిందే. ఇదే లాంచ్ ఈవెంట్లో భాగంగా Mi Note 2 Pro డివైస్ను కూడా షియోమీ ఆవిష్కరించే అవకాశముందని రూమర్ మిల్స్ చెబుతున్నాయి. చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ Weiboలో పోస్ట్ అయిన ఓ ఇమేజ్ ప్రకారం Mi Note 2 Pro ఈ విధంగా ఉండబోతున్నాయి.

డ్యుయల్ ఎడ్జ్ స్ర్కీన్
Weibo రిపోర్ట్ ప్రకారం Mi Note 2 Pro డివైస్ డ్యుయల్ ఎడ్జ్ స్ర్కీన్, శక్తివంతమైన 8జీబి ర్యామ్లతో రాబోతోంది. (ఫైల్ ఫోటో)

MIUI 8
Weibo రిపోర్ట్ ప్రకారం Mi Note 2 Pro ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8తో వస్తోంది. (ఫైల్ ఫోటో)

ఇంటర్నల్ స్టోరేజ్
Weibeibo రిపోర్ట్ ప్రకారం Mi Note 2 Pro ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 128జీబి). (ఫైల్ ఫోటో)

3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
Weibeibo రిపోర్ట్ ప్రకారం Mi Note 2 Pro 3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో రాబోతోంది. (ఫైల్ ఫోటో)

యూఎస్బీ టైప్ సీ పోర్ట్
Weibo రిపోర్ట్ ప్రకారం Mi Note 2 Pro ఫోన్ యూఎస్బీ టైప్ సీ పోర్ట్ అలానే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రాబోతోంది. చైనా మార్కెట్లో 64జీబి Mi Note 2 Pro వేరియంట్ ధర రూ.25,000, 128జీబి Mi Note 2 Pro వేరియంట్ ధర రూ.28,000 ఉండొచ్చని తెలుస్తోంది.

Xiaomi Mi 5s రూమర్ స్పెక్స్
2.4 గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 821 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్తో పాటు 256 జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్ కెపాసిటీ, 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 4 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4కే వీడియో సపోర్టింగ్, డ్యూయల్ సిమ్, జీపీఆర్ఎస్/ఈడీజీఈ, ఎన్ఎఫ్సీ, 3జీ, 4జీ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ, 3490 ఎంఏహెచ్ బ్యాటరీ


Click it and Unblock the Notifications








