భారత్లో Redmi K50i మొబైల్ విడుదల రేపే.. లైవ్ స్ట్రీమింగ్ అక్కడే!
Xiaomi కంపెనీ భారత్లో K Series మొబైల్స్ను మళ్లీ తీసుకు వచ్చే ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే Redmi K50i మోడల్ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ రంగం సిద్ధం చేసుకుంది. జులై 20 వ తేదీన, బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించబోయే ఈవెంట్లో ఈ మొబైల్ను కంపెనీ భారత్లో విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన ఈవెంట్ను వ్యూవర్స్ లైవ్ స్ట్రీమింగ్ లో చూడవచ్చు. ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ ను కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా చూడవచ్చు. కాగా, ఇప్పుడు ఈ మొబైల్కు సంబంధించిన లీక్ స్పెసిఫికేషన్లు, ఇతర ఫీచర్లను గురించి మనం తెలుసుకుందాం.

Redmi K50i లీక్డ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ కు 6.6 అంగుళాల full-HD + LCD డిస్ప్లే పానెల్ను అందిస్తున్నారు. ఇది 144Hz రిఫ్రెష్ రేటుతో పని చేస్తుంది. ఈ హ్యాండ్సెట్ MediaTek Dimensity 8100 (5 nm) ప్రాసెసర్ను కలిగి ఉంది. ఈ మొబైల్ IP53 వాటర్ లేదా డస్ట్ రెసిస్టాన్స్ రేటింగ్ ఫీచర్తో వస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ సహకారంతో పనిచేస్తుంది.
ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కెమెరా 64 మెగాపిక్సల్ క్వాలిటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరో రెండు కెమెరాలు 8 మెగాపిక్సెల్(అల్ట్రా వైడ్ లెన్స్), 2 మెగాపిక్సెల్ క్వాలిటీ (మాక్రో లెన్స్)ని కలిగి ఉన్నాయి. ఈ మొబైల్కు ఫ్రంట్ సైడ్ వీడియో కాలింగ్ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 4,400 mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయల్ సిమ్ స్లాట్స్, రెండిటికీ 5జీ నెట్వర్క్ సపోర్ట్ సిస్టమ్ కలిగి ఉంది.

తాజాగా లీకైన వివరాల ప్రకారం, Redmi K50i బేస్ మోడల్ ధర రూ. 24,000 నుండి రూ. 28,000 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 8GB/256GB స్టోరేజీ కలిగిన తదుపరి వేరియంట్ రూ. 29,000 నుండి రూ. 33,000 ధర పరిధిలో అందుబాటులో ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న Redmi Note 10 Pro ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ కు 6.67 అంగుళాల full-HD +AMOLED డిస్ప్లే పానెల్ను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో పని చేస్తుంది. ఈ హ్యాండ్సెట్Qualcomm SM7150 Snapdragon 732G (8 nm) ప్రాసెసర్ను కలిగి ఉంది. ఈ మొబైల్ IP53 వాటర్ లేదా డస్ట్ రెసిస్టాన్స్ రేటింగ్ ఫీచర్తో వస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఓఎస్ సహకారంతో పనిచేస్తుంది.

ఈ మొబైల్ నాలుగు కెమెరాల సెటప్ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కెమెరా 108 మెగాపిక్సల్ క్వాలిటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరో రెండు కెమెరాలు 8 మెగాపిక్సెల్(అల్ట్రా వైడ్ లెన్స్), 5 మెగాపిక్సెల్ క్వాలిటీ (మాక్రో లెన్స్)ని కలిగి ఉన్నాయి. ఈ మొబైల్కు ఫ్రంట్ సైడ్ వీడియో కాలింగ్ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 5020 mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయల్ సిమ్ స్లాట్స్, రెండిటికీ 5జీ నెట్వర్క్ సపోర్ట్ సిస్టమ్ కలిగి ఉంది. ఈ మొబైల్ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో 20శాతం డిస్కౌంట్తో రూ.15,999 ధరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








