6 సెకన్లలో 40,000 ఫోన్ల అమ్మకం!

షియోమీ రైడ్మై నోట్ 4జీ వేరియంట్ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఇండియన్ మార్కెట్లో మొదటి సారిగా ఈ రోజు ప్రారంభమయ్యాయి. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్కార్ట్ ఈ స్మార్ట్ఫోన్లను ఎక్స్క్లూజివ్గా విక్రియస్తోంది. దాదాపుగా రెండ లక్షల మంది యూజర్లు ఈ ఫోన్లను రిజిస్టర్ చేసుకున్నారు. మొదటి స్టాక్లో భాగంగా 40,000 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచటంతో 6 సెకన్లలోనే మొత్తం ఫోన్లు అమ్ముడైపోయినట్లు షియోమీ ఇండియా హెడ్ మను కుమార్ జైన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. మార్కెట్లో షియోమీ రైడ్మై నోట్ 4జీ వేరియంట్ ధర రూ.9,999
మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్డేట్స్ పొందండి

షియోమీ రైడ్మై నోట్ 4జీ స్మార్ట్ఫోన్ స్పెసిఫికేషన్లు
5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఎమ్ఐయూఐ 5 ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ కిట్క్యాట్ ఆధారం).


Click it and Unblock the Notifications








