అత్యంత తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లు, దూసుకొస్తున్న మరో చైనా కంపెనీ
త్వరలో మరో చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ ఫోన్ లు ఇండియా మార్కెట్ లోకి రాబోతున్నాయి.
త్వరలో మరో చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ ఫోన్ లు ఇండియా మార్కెట్ లోకి రాబోతున్నాయి. చైనీస్ కంపెనీలు షియోమీ , ఒప్పో, వివో, లెనోవోల సక్సెస్లు చూసిన తర్వాత ఈ కంపెనీ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ప్లాన్ చేస్తుంది .షియోమీ ప్రత్యర్థి గోమ్ ఎలక్ట్రానిక్స్ భారత్లో తన ప్రొడక్ట్లను మెగా లాంచ్ చేయబోతుంది . తొలుత తక్కువ ధరలో మూడు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.స్మార్ట్ఫోన్లను మాత్రమే కాక టెలివిజన్లు, హోమ్ అప్లియెన్స్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్ల లాంటి కన్జ్యూమర్ ప్రొడక్ట్ కేటగిరీలను విక్రయించాలని కూడా గోమ్ ప్లాన్ చేస్తోంది.

రూ.10వేల ధరలో మూడు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను......
మొదటగా గోమ్ ఎలక్ట్రానిక్స్ రూ.10వేల తక్కువ ధరలో మూడు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయబోతుంది. ఈ స్మార్ట్ఫోన్లను అన్ని మల్టి బ్రాండ్ స్టోర్లు, ఆన్లైన్ల ద్వారా విక్రయించాలని ఆ కంపెనీ నిర్ణయించింది.

ఫ్లిప్కార్ట్తో కూడా గోమ్ కంపెనీ చర్చలు జరుపుతోంది.....
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో కూడా గోమ్ కంపెనీ చర్చలు జరుపుతోంది.

టెలివిజన్లు, హోమ్ అప్లియెన్స్, రిఫ్రిజిరేటర్లు....
స్మార్ట్ఫోన్లను మాత్రమే కాక టెలివిజన్లు, హోమ్ అప్లియెన్స్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్ల లాంటి కన్జ్యూమర్ ప్రొడక్ట్ కేటగిరీలను విక్రయించాలని కూడా గోమ్ ప్లాన్ చేస్తోంది. దీని కోసం మల్టి బ్రాండ్ స్టోర్లతో కూడా భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీంతో శాంసంగ్, టీసీఎల్, గోద్రెజ్, బజాజ్ లాంటి దిగ్గజ కంపెనీలకు ప్రత్యక్ష పోటీ ఇవ్వనుంది.

1700 స్టోర్లు....
చైనా లో ఈ కంపెనీకు 1700 స్టోర్లు ఉన్నాయి .

పీయూష్ పురిని గోమ్ ఎలక్ట్రానిక్స్, భారత అధినేతగా......
భారత్ కార్యకలాపాల కోసం 2018 మార్చిలో పీయూష్ పురిని గోమ్ ఎలక్ట్రానిక్స్, భారత అధినేతగా నియమించింది. పీయూష్ అంతకముందు మూడేళ్లు అమెరికా మల్టినేషనల్ దిగ్గజం ఫాక్స్కాన్ ఇన్-హౌజ్ బ్రాండ్ ఇన్ఫోకస్కు దేశీయ అధినేతగా బాధ్యతలు నిర్వర్తించేవారు.

ఇన్ఫోకస్ మొబైల్ బ్రాండ్ను ఇండియాలో .....
ఇన్ఫోకస్ మొబైల్ బ్రాండ్ను భారత్లో లాంచ్ చేయించింది కూడా పీయూష్ పురినే . ఇన్ఫోకస్ తన ఆన్లైన్ విస్తరణ మరింత విస్తృతం చేసుకోవడానికి అమెజాన్తో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది.

బ్రాండ్ అంబాసిడర్గా రన్వీర్ సింగ్ను.....
గోమ్ కంపెనీ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్కు బ్రాండ్ అంబాసిడర్గా రన్వీర్ సింగ్ను నియమించింది.


Click it and Unblock the Notifications








