జియో వచ్చిన తరువాత టెలికాం మార్కెట్లో జరిగిన భారీ మార్పులు ఇవే ?
జియో రాకతో జరిగిన ఇండియాలో జరిగిన భారీ మార్పులు..
తక్కువ కాలంలో దేశాన్ని ఓ ఊపు ఊపిన టెల్కో ఏదైనా ఉందంటే అది జియో మాత్రమే. జియో రాకతో దిగ్గజాలన్నీ కోట్ల నష్టాలను చవిచూసిన విషయం అందరికీ తెలిసిందే. బడా బడా కంపెనీలు సైతం కుదేలయ్యాయి. అయితే దేశంలోకి జియో ఎంటరయిన తరువాత జరిగిన భారీ మార్పులపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

అల్ట్రా చీప్ డేటా
ఒకప్పుడు ఎంతో కాస్ట్ ఉన్న డేటా జియో రాకతో ఒక్కసారిగా దిగొచ్చింది. ఇప్పుడు యూజర్లు డేటాకి డబ్బులు కట్టాలన్న సంగతే మరచి ఎంజాయ్ చేస్తున్నారు.

ఆన్లైన్ వాడకం
ఇంతకు ముందు కాల్స్ చేయాలంటే భయపడిపోయేవారు. ఎక్కడ ఖర్చు అవుతుందేమోనని. కాని ఇప్పుడు ఫ్రీ కాల్స్ తో మొత్తం మారిపోయింది. డబ్బు ఆదా అవుతోంది.

4జీ మార్కెట్
4జీ అంటే ఒకప్పుడు చాలా రిచ్. అయితే జియో రాకతో అదీ చాలా చీప్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా 4జీ మొబైల్స్ దర్శనమిస్తున్నాయి. తక్కువ ధరకే 4జీ ఫోన్లను కంపెనీలు తీసుకువస్తున్నాయి.

బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ లభ్యత
హై స్పీడ్ ఇంటర్నెట్ ఒకప్పుడు కొందరికే పరిమితం. ఇప్పుడు ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు. బ్రాడ్ బ్యాండ్ రంగంలో జియోనే టాప్

165 కోట్ల వీడియోలు
జియో ఉచిత డేటా పుణ్యమా అని యూజర్లు 165 కోట్ల వీడియోలను చూశారు. అన్ని రకలా సోషల్ మీడియాలను జియో ద్వారానే ఓపెన్ చేశారు.

చచ్చిన 3జీ
జియో రాకతో 3జీకి కాలం చెల్లిపోయినట్లే అయింది. అందరూ 4జీ మీద పడటంతో దానికి డిమాండ్ బాగా తగ్గిపోయింది.

రికార్డు యూజర్లు
జియో కేవలం ఆరు నెలల్లోనే 100 మిలియన్ యూజర్లను సంపాదించుకుంది. వాట్సప్, ఫేస్ బుక్ లను సైతం అధిగమించింది.

ఆన్ లైన్ కంటెంట్
జియో రాకతో డేటా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కేవలం ఆరునెలల్లోనే 120 కోట్ల జిబి వాడేశారంటే అర్థం చేసుకోవచ్చు.

ఐడియా, వొడాఫోన్ మెర్జ్
జియో దెబ్బకు టెలికం రంగం ఒక్కసారిగా కుదుపులకు లోనైన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఐడియా, వొడాఫోన్ నష్టాలను చూడలేక ఒక్కటయ్యాయి.


Click it and Unblock the Notifications








