సెల్ఫీ పిచ్చికి ఇద్దరు కుర్రాళ్లు బలి
సెల్ఫీల పై వెర్రి వ్యామోహంతో మితిమీరి ప్రవర్తిస్తే అనేక అనర్థాలు తప్పవని ఇప్పటికే అనేక సంఘటనలు రుజువు చేసాయి.
సెల్ఫీల పై వెర్రి వ్యామోహంతో మితిమీరి ప్రవర్తిస్తే అనేక అనర్థాలు తప్పవని ఇప్పటికే అనేక సంఘటనలు రుజువు చేసాయి. సోషల్ మీడియాలో నిత్య కొత్తదనం కోసం పరితపిస్తున్న యువత ప్రస్తుతం 'సెల్ఫీ' లోకంలో విచ్చలవిడిగా విహరిస్తున్నారు. ఒక్కోసారి ఈ సెల్ఫీ వ్యామోహం శృతిమించి ప్రాణాలమీదకు తెస్తోంది.ఐదు రోజుల క్రితం ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది .రైలు వస్తుండగా సెల్ఫీ తీసుకునే క్రమంలో ఇద్దరు కుర్రాళ్లు వారి ప్రాణాలను కోల్పోయారు.చనిపోయిన ఇద్దరు కుర్రాళ్లు రామ్ పురా గ్రామానికి చెందిన యువరాజ్ మరియు గౌరవ్ అని పోలీసులు తెలిపారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే

లుధియానాకు చెందిన .....
లూథియానా లోని రామ్ పురా గ్రామానికి చెందిన యువరాజ్ మరియు గౌరవ్ 7వ తరగతి చదువుతున్నారు. రైలు రన్నింగ్ లో ఉండగా సెల్ఫీ తీసుకునే క్రమంలో ఆ కుర్రాళ్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు .

ముగ్గురు మిత్రులు కలిసి వెళ్లారు.....
ముగ్గురు మిత్రులు కలిసి చండీగఢ్-లుధియానా లైన్ లోని కటానా సాహిబ్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్దకు సెల్ఫీ ఫోటోలు తీసుకోవడానికి వెళ్లారు.

రైలు రన్నింగ్ లో ఉండగా.....
సెల్ఫీ తీసుకునేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో రైలు వచ్చే విధంగా ఫోటో తీసుకోవాలని అనుకున్నారు .అయితే రైలు వస్తుండగా ఒక కుర్రాడు బయపడి పక్కకి పారిపోగా ఇద్దరు మాత్రం రైలుకు చాలా దగ్గరగా నించున్నారు.పక్కన నించున్న ఉన్న ఇద్దరు కుర్రాళ్ళని రైలు డీ కొట్టగా అక్కడిక్కడే మృతి చెందారు .

ఈ మధ్య కాలంలో.....
ఈ మధ్య కాలం లో ఈ సెల్ఫీ పిచ్చి చాలా ఎక్కువ అయిపోయింది.కొందరు కురాళ్ళ మితి మీరిపోయి రైలు లో స్టంట్స్ చేస్తూ ఫొటోలు వీడియోలు తీసుకుంటున్నారు.అలంటి ఫొటోస్ కొన్ని చూడండి.

మునిగిపోతు ఉన్న పట్టించుకోకుండా....
వెనుక నీళ్లలో మునిగిపోతున్న పట్టించుకోకుండా సెల్ఫీ తీసుకుంటున్న కుర్రాళ్ళు.

ఫేక్ అయినప్పటికీ.....
ఈ ఫోటో ఫేక్ అయినప్పటికీ కొన్ని నెలల క్రితం ఈ ఫోటో సోషల్ మీడియా లో హల్ చల్ చేసింది.


Click it and Unblock the Notifications








