ఫ్లిప్కార్ట్ డెలివరీ హబ్ నుంచి 150 మొబైల్స్ ను దొంగలించిన ఢిల్లీ కేటుగాళ్లు
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మంచితో పాటు చెడు కూడా ఎదురవుతోంది. దొంగలు ఇప్పుడు మరీ తెలివి మీరి పోతున్నారు
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మంచితో పాటు చెడు కూడా ఎదురవుతోంది. దొంగలు ఇప్పుడు మరీ తెలివి మీరి పోతున్నారు.విషయంలోకి వెళ్తే ఢిల్లీలోని ఓ ప్రొఫెషనల్ దొంగల ముఠా ఫ్లిప్కార్ట్ డెలివరీ హబ్ నుండి ఏకకంగా 150 మొబైల్స్ ను దొంగలించిన సంఘటన వెలుగులోకి వచ్చింది . పూర్తి వివరాల్లోకి వెళ్తే

డెలివరీ హబ్ నుండి బినోలా, బిలాస్పూర్ వేర్ హౌస్ కు మొబైల్స్ తరలిస్తున్న సమయంలో...
ఫిబ్రవరి 19న డెలివరీ హబ్ నుండి బినోలా, బిలాస్పూర్ వేర్ హౌస్ కు మొబైల్స్ తరలిస్తున్న సమయంలో ఢిల్లీ కి చెందిన ఓ దొంగల ముఠా 150 మొబైల్స్ ను దొంగలించినట్టు ఫ్లిప్కార్ట్ సెక్యురిటి టీమ్ యొక్క సర్టిఫైడ్ విజిలెన్స్ దర్యాప్తు నిపుణుడు మాన్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును ను ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలబెట్టారు.

సంతోష్ కుమార్ తో పాటు ముగ్గురు సభ్యులను...
ముఠా నాయకుడు సంతోష్ కుమార్ తో పాటు ముగ్గురు సభ్యులను ద్వారకా ప్రాంతం వద్ద పొలుసులు అరెస్టు చేసి వారి వద్ద 30 కొత్త మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

రూ.2.5 లక్షలు విలువ గల మొబైల్ ఫోన్లను...
రూ.2.5 లక్షలు విలువ గల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకొని వాటిని సీజ్ చేసారు.

వివిధ రవాణా సంస్థలతో డ్రైవర్లుగా....
ఈ నలుగురు దొంగలు సంతోష్ కుమార్, బ్రిజ్మోహన్, అఖిలేష్ మరియు రంజిత్ వివిధ రవాణా సంస్థలతో డ్రైవర్లుగా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

గతంలో 100 పంచదార మూటలను ....
దొంగతనాలు చేయడంలో ఈ దొంగలకు కొత్త ఏమి కాదు. గతంలో 100 పంచదార మూటలను పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రేషన్తో కూడిన కంటెయినర్ ను సంతోష్ కుమార్, బ్రిజ్మోహన్ దొంగలించినట్టు ఉత్తరప్రదేశ్లోని ఫుర్సత్గంజ్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి.


Click it and Unblock the Notifications








