బెంగళూరు వాసులకు ‘4జీ కిక్’!

కోల్కతా ద్వారా భారత్కు 4జీ నెట్వర్క్ సేవలను పరిచయం చేసిన టెలికాం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్, విస్తరణలో భాగంగా ఈ తరహా సేవలను సోమవారం బెంగుళూరులో ప్రారంభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డివి సదానంద గౌడ్ లాంఛనంగా ఈ నెట్వర్క్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు పలు ఆఫర్లతో కూడిన 4జీ ప్యాకేజిలను ఎయిర్టెల్ ప్రవేశపెట్టింది. ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా భారతీ ఎయిర్టెల్ సీఈవో సంజయ్ కపూర్ స్పందిస్తూ... 4జీ సేవలు ప్రారంభంతో సాంకేతికపరంగా భారత్కు మంచి గుర్తింపు లభించిందని, ఈ వేగవంతమైన నెట్వర్క్ వినియోగదారుల కమ్యూనికేషన్ అవసరాలను సమృద్ధిగా తీర్చగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. 3జీ స్పీడ్తో పోలిస్తే 4జీ స్పీడ్ 10 రెట్లు అధికంగా ఉంటుంది. ప్రస్తుతానికి 3జీ నెట్వర్క్ స్పీడ్ 21 ఎంబీపీఎస్గా ఉంటే రానున్న 4జీ నెట్వర్క్ స్పీడ్ 100 ఎంబీపీఎస్ పై మాటే.


Click it and Unblock the Notifications








