ఈ మూడు ప్రభుత్వ సేవలకు ఆధార్ తప్పనిసరి
గత ఏడాది సెప్టెంబర్లో సుప్రీం ఇచ్చిన తీర్పులో బ్యాంకు ఖాతాలు, మొబైల్ కనెక్షన్స్, స్కూల్ అడ్మిషన్లకు, UGC, NEET మరియు CBSE పరీక్షలకు ఆధార్ తప్పనిసరి కాదని న్యాయస్థానం వెల్లడించింది.
గత ఏడాది సెప్టెంబర్లో సుప్రీం ఇచ్చిన తీర్పులో బ్యాంకు ఖాతాలు, మొబైల్ కనెక్షన్స్, స్కూల్ అడ్మిషన్లకు, UGC, NEET మరియు CBSE పరీక్షలకు ఆధార్ తప్పనిసరి కాదని న్యాయస్థానం వెల్లడించింది.కాగా ఆధార్ వినియోగాన్ని మరింత సులభతరం చేస్తూ యునిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (యూఐడిఏఐ) కొన్ని సంచలన నిర్ణయాలుతీసుకుంది .ఇక పై ఈ మూడు ప్రభుత్వ సేవలకు ఆధార్ తప్పనిసరి చేసింది.మరి ఆ ప్రభుత్వ సేవలేంటో ఓ సారి చూడండి

ఆధార్-పాన్ కార్డ్ లింక్
పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఆధార్ నెంబర్ ను లింక్ చేయాలనీ సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా కొత్తగా పాన్ కార్డు కొరకు అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందిగా కోరింది.మార్చ్ 31లోపు పాన్ కార్డు ను ఆధార తో లింక్ చేయకోపోతే పాన్ కార్డులు చెల్లవంటూ తెలిపింది.

ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఆధార్
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు పొందేందుకు ఆధార్ తప్పనిసరిగా ఉండాలి

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం కోసం ఆధార్
ఆధార్ ను పాన్ కార్డు లింక్ తో పాటు ఐటీ రిటర్న్స్ ను ఫైల్ చేసేటప్పుడు కూడా ఆధార్ తప్పనిసరిగా ఉండాలి


Click it and Unblock the Notifications








