వాట్సప్ ఇండియాకి కొత్త బాస్, ఓ లుక్కేసుకోండి
ఇన్స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఫేస్బుక్ సొంత యాప్ వాట్సప్ ఇండియాకు కొత్త బాసుని నియమించింది.
ఇన్స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఫేస్బుక్ సొంత యాప్ వాట్సప్ ఇండియాకు కొత్త బాసుని నియమించింది. వాట్సప్ ఇండియా అధిపతిగా ప్రముఖ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ సంస్థ 'ఇజెట్' యాప్ సహవ్యవస్థాపకుడు, సీఈవో అబిజిత్ బోస్ నియమితులయ్యారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆయన వాట్సాప్ ఇండియా సీఈవోవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేకు వాట్సప్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు గురుగ్రామ్ కేంద్రంగా భారత్లో ప్రధాన కార్యాలయం కూడా ఏర్పాటు చేయనుంది. కాలిఫోర్నియాలో ఉన్న వాట్సప్ ప్రధాన కార్యాలయం తరువాత విదేశాల్లో ఏర్పాటు కాబోతున్న తొలి కార్యాలయం ఇదే కావడం విశేషం.

హార్వార్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకున్న అభిజిత్ కు ...
ఇదిలా ఉంటే హార్వార్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకున్న అభిజిత్ కు వాణిజ్య వ్యూహాల్లో దిట్టగా పేరు ఉంది. సాధారణ వినియోగదారులు, వ్యాపార వర్గాలు మరింతగా ఆకర్షించే విధంగా వాట్సప్ను రూపుదిద్దడంతో పాటు నకిలీ సందేశాలను అరికట్టేలా అభిజిత్ టీమ్ చర్యలు తీసుకోనుంది.

వాట్సప్ ఇండియా సీఈవోగా అజిజిత్ బోస్....
వాట్సప్ ఇండియా సీఈవోగా అజిజిత్ బోస్ నియామకంతో ఈ వేదిక నుంచి ఫేస్ న్యూస్ వ్యాప్తి కాకుండా అడ్డుకోవాలని భారత ప్రభుత్వ ఆధారం వైపుగా ఒక అడుగు ముందుకేసింది. ఇటీవలే కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, వాట్సప్ ఉపాధ్యక్షుడు చిరిస్ డానియల్తో సమావేశమైన సంగతి తెలిసిందే

ఫేక్ న్యూస్ వ్యాపింపజేయడంతో....
ఈ సంవత్సరం ప్రారంభం నుండి అనుమానాలతో కూడిన ఫేక్ న్యూస్ వ్యాపింపజేయడంతో వరుస ముక దాడులతో పలువురు అమాయకులు మరణించిన నేపథ్యంలో వాట్సప్ లో వాటిని నియంత్రించడానికి అంతర్జాతీయంగా ఒక వేదిక అవసరం అని సంస్థ భావిస్తోంది.

దేశీయ కార్యకలాపాలు నియంత్రించడానికి....
ఇందులో భాగంగా దేశీయ కార్యకలాపాలు నియంత్రించడానికి స్థానిక నాయకత్వం అవసరం అని చిరిస్ ద్రుష్టికి రవిశంకర్ ప్రసాద్ తెచ్చినట్లు సమాచారం.ఫేస్ న్యూస్ వెండింగ్ కేంద్రాన్ని కనిపెట్టడానికి కూడా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కోరారు.


Click it and Unblock the Notifications








