ఏసర్ డేటా లీక్: 50GB కంటే ఎక్కువ ఇండియన్ యూజర్ల వ్యక్తిగత డేటా లీక్ అయింది

|

ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ కంపెనీ ఏసర్ యొక్క భారతీయ సర్వర్‌లపై హ్యాకర్లు ఈ వారం ప్రారంభంలో దాడి చేసి 50GB డేటాను దొంగిలించారు. డేటా బ్రీచ్‌ల ప్రకారం డెసర్‌డెన్ అనే హ్యాకర్ గ్రూప్ వారు ఏసర్ యొక్క భారతీయ సర్వర్‌ల నుండి దాదాపు 60GB డేటాను దొంగిలించారని పేర్కొన్నారు. హ్యాకర్లు తాము దొంగిలించిన డేటాలో కస్టమర్‌లతో పాటుగా కార్పొరేట్ బిజినెస్ డేటా కూడా ఉందని పేర్కొన్నారు. ఈ డేటా లీక్‌కి సాక్ష్యంగా హ్యాకర్ల ఫోరమ్‌లో ఒక వీడియోను కూడా హ్యాకర్ గ్రూప్ పోస్ట్ చేసింది. ఈ డేటా లీక్‌లో 10,000 మంది కస్టమర్‌ల డేటా మరియు 3,000 డిస్ట్రిబ్యూటర్‌లు మరియు రిటైలర్ల డేటా ఉన్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఏసర్ డేటా లీక్

ఏసర్ డేటా లీక్

ఏసర్ ఇంత భారీ డేటా ఉల్లంఘనకు గురవడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం మార్చిలో టెక్ దిగ్గజం రెవిల్ రాన్‌సమ్‌వేర్ ద్వారా దాడి చేయబడింది. దొంగిలించబడిన డేటాను తిరిగి పొందడానికి హ్యాకర్లు 50 మిలియన్ డాలర్ల విమోచన డిమాండ్ చేశారు. అయితే విమోచన డబ్బు హ్యాకర్‌కు చెల్లించబడిందా అని ఏసర్ ఇంకా నిర్ధారించలేదు.

ఏసర్

తైవానీస్ కంపెనీ ఏసర్ ప్రతినిధి ఈ సైబర్ దాడిని ZDNet కు ధృవీకరించారు. కంపెనీ తన భద్రతా వ్యవస్థ ద్వారా ఈ ఒక్క దాడిని గుర్తించినట్లు పేర్కొంది. భారతదేశంలోని తమ స్థానిక విక్రయానంతర సేవా వ్యవస్థ నుండి ఈ దాడిని తాము చూశామని టెక్ దిగ్గజం తెలిపింది. దీని తరువాత కంపెనీ మొత్తం వ్యవస్థను పూర్తి స్కాన్ చేసింది మరియు సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను యాక్టివేట్ చేసింది.

సిస్టమ్

"మా భద్రతా బెదిరింపు సిస్టమ్ తనిఖీలలో భాగంగా భారతదేశంలో మా స్థానిక అమ్మకాల అనంతర సర్వీస్ వ్యవస్థపై అక్టోబర్ 2021 ప్రారంభంలో ఒక వివిక్త దాడిని మేము ఇటీవల గుర్తించాము. రాజీపడని భారతీయ కస్టమర్ల ఆర్థిక సమాచారం లేనప్పటికీ మేము ప్రభావితమైన వినియోగదారులను చురుకుగా చేరుతున్నాము" అని ఏసర్ ఒక ప్రకటనలో తెలిపారు.

హ్యాకింగ్

ఈ హ్యాకింగ్ ద్వారా ప్రభావితమైన వినియోగదారులకు దాని గురించి తెలియజేయబడిందని కంపెనీ తెలిపింది. ఈ దాడి గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తమకు తెలియజేసిందని కంపెనీ తెలిపింది. ఏసర్ దాని కార్యకలాపాలపై ఎటువంటి భారీ ప్రభావం లేదని వెల్లడించింది. "ఈ సంఘటన మా కార్యకలాపాలు మరియు వ్యాపార కొనసాగింపుపై ఎటువంటి భౌతిక ప్రభావాన్ని చూపదు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు మరియు అధికారుల సహాయంతో భారతదేశంలో భద్రతా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి ఏసర్ అదనపు వనరులను కూడా కేటాయిస్తోంది.

ఎయిర్‌టెల్ రూ.6,000 క్యాష్ బ్యాక్ ఆఫర్

ఎయిర్‌టెల్ రూ.6,000 క్యాష్ బ్యాక్ ఆఫర్

భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుతం తన యొక్క వినియోగదారులకు అందించే రూ.6,000 క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని 36 నెలల వ్యవధిలో రెండు భాగాలుగా అందిస్తుంది. రూ.249 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రీపెయిడ్ ప్యాక్‌తో 18 నెలలపాటు నిరంతర రీఛార్జ్‌లను పూర్తి చేసినప్పుడు మొదటి క్యాష్‌బ్యాక్ రూ.2,000 వినియోగదారులకు అందించబడుతుంది. ఇంకా రూ.249 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో 36 నెలల రీఛార్జి పూర్తి చేసిన తర్వాత రూ.4,000 మిగిలి మొత్తం వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ రూపంలో అందించబడుతుంది. ఇది మాత్రమే కాకుండా ఎయిర్‌టెల్ సంస్థ తన యొక్క వినియోగదారులకు రూ.4,800 విలువైన ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ప్రయోజనాన్ని కూడా కస్టమర్‌లకు అందిస్తోంది. రూ.12,000 లోపు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం స్క్రీన్ రీప్లేస్ చేయడానికి సుమారుగా అయ్యే ఖర్చు రూ .4,800. దీనిని ఎయిర్‌టెల్ యూజర్లకు ఉచితంగా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Acer Data Leak: More Than 50GB Indian Users Personal Data Leaked

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X