Just In
- 45 min ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 8 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 11 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
Don't Miss
- Finance
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బాటిల్ కొనాలంటే ఇక నగదు అవసరం లేదు!
- News
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై హైకోర్టు తీర్పు 6న
- Movies
Michael day 1 collections మైఖేల్కు తమిళ, తెలుగులో ఊహించని రెస్పాన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అదానీ గ్రూప్ తన 5G సేవలను ఆరు సర్కిళ్లలో లాంచ్ చేయనున్నది...
ఇండియాలోని టెలికాం రంగంలో ఇప్పటి వరకు జియో, ఎయిర్టెల్ మరియు Vi వంటి మూడు ప్రైవేట్ టెలికాం సంస్థలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన 5G స్పెక్ట్రమ్ వేలంలోకి అదానీ గ్రూప్ ఆశ్చర్యకరంగా ప్రవేశించడమే కాకుండా స్పెక్ట్రమ్ ను కూడా కొనుగోలు చేసింది. 5Gతో టెలికాం విభాగంలో జియో మరియు ఎయిర్టెల్లకు బలమైన పోటీని ఇస్తుంది అని చాలామంది మొదట్లో ఊహించారు. అయితే B2B స్పేస్లో కస్టమర్లకు సర్వీస్ చేయాలనుకుంటున్నట్లు అదానీ గ్రూప్ తర్వాత స్పష్టం చేసింది.

ప్రస్తుతం అదానీ గ్రూప్ వినియోగదారుల మొబిలిటీ స్పేస్లోకి ప్రవేశించడానికి ఇష్టపడటం లేదు దీనితో స్పష్టం అవుతున్నది. ప్రస్తుతానికి స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొన్న అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన అదానీ డేటా నెట్వర్క్స్ లిమిటెడ్ ఆరు LSAs (లైసెన్స్డ్ సర్వీస్ ఏరియాస్) సేవలతో ప్రారంబించే ఆలోచనలో ఉంది. అదానీ డేటా నెట్వర్క్స్ ఆరు సర్కిళ్లలో మాత్రమే యూనివర్సల్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిందని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అదానీ డేటా నెట్వర్క్స్ కంపెనీ కొనుగోలు చేసిన 5G స్పెక్ట్రమ్ కొన్ని సర్కిల్లకు మాత్రమే పరిమితంగా ఉంది. ఈ ఆరు సర్కిల్లలో అదానీ డేటా నెట్వర్క్లు స్పెక్ట్రమ్ని కలిగి ఉండవచ్చు. వేగవంతమైన 5G నెట్వర్క్ల శక్తితో ఈ గ్రూప్ తన యొక్క టెలికాం సేవలను ప్రారంభిస్తుంది. నియంత్రణ అవసరాలను నెరవేర్చడానికి కంపెనీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలి. అదానీ గ్రూప్ కంపెనీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొన్న సమయం నాటికి దానికి లైసెన్స్ కూడా లేకపోవడం గమనార్హం.

అదానీ డేటా నెట్వర్క్స్ 5G స్పెక్ట్రమ్ కొనుగోలు వివరాలు
అదానీ డేటా నెట్వర్క్స్ 26 GHz బ్యాండ్లో 400 MHz స్పెక్ట్రమ్ను రూ.212 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ సంస్థ వినియోగదారులకు ఎక్కువగా సేవలను అందించే మిడ్-బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం వెళ్లలేదు. ఇది అదానీ డేటా నెట్వర్క్ల నుండి చాలా సంప్రదాయబద్ధమైన కొనుగోలు కావడంతో 5Gతో జియో, ఎయిర్టెల్ మరియు Viతో వినియోగదారుల స్థలంలోని పోటీలో పాల్గొనడానికి కంపెనీకి ఎలాంటి ఆసక్తిని చూపలేదు. కానీ యూసర్ బేస్ మార్కెట్ మరింత పరిపక్వం చెందితే కనుక 5G యుగంలో రిలయన్స్కు బలమైన పోటీని ఇవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటున్నందున అదానీ గ్రూప్ ముందు ముందు ఈ విభాగంలోకి ప్రవేశించడం మనం చూడవచ్చు.

జియో 5G లాంచ్
భారతదేశం యొక్క నంబర్ వన్ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో భారతదేశంలో అందరికంటే ముందుగా తన విశాలమైన 5G నెట్వర్క్లను త్వరగా ప్రారంభించి ఆపరేట్ చేయాలని భావిస్తున్నారు. 5G లాంచ్ యొక్క ఖచ్చితమైన తేదీ ఏమిటి అని కంపెనీ అభిమానులు ఎదురుచూడం అనేది సహజం. ఇది ఎప్పటికి జరుగుతుందనే దానిపై మార్కెట్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. స్టార్టర్స్ కోసం ఇది ఆగస్ట్ 2022లోనే జరుగుతుందనే బలమైన సూచన ఉంది. ఆగస్టు 29, 2022న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అనువల్ జనరల్ మీట్ (AGM) లో 5G లాంచ్ జరిగే అవకాశం అధికంగా ఉంది. DoT (టెలికమ్యూనికేషన్స్ విభాగం)కి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించిన తర్వాత టెల్కోలకు స్పెక్ట్రమ్ కేటాయించబడింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470