ఎయిర్సెల్ ‘ఆగష్టు 15’ ఆఫర్ (ఒక్క దెబ్బకు మూడు పిట్టలు)

ప్రముఖ టెలికామ్ నెట్వర్క్ ప్రొవైడర్ ఎయిర్సెల్ స్వాత్రంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘స్పెషల్ మొబైల్ హ్యాండ్సెట్ ప్లాన్’ను మంగళవారం నుంచి అందిచనుంది .‘1508’ పేరుతో విడుదలవుతున్న ఈ స్పెషల్ ఆఫర్ ద్వారా యూజర్ రూ.1508 విలువ చేసే జీపీఆర్ఎస్ డ్యూయల్ సిమ్ ఫోన్తో పాటు రూ.1508 విలువచేసే టాక్టైమ్, 1508 టెక్స్ట్ సందేశాలు అదేవిధంగా 1508 ఎంబీ 2జీ డేటాను ఉచితంగా పొందవచ్చు. ఈ డేటా వినియోగానికి 90 రోజుల వ్యాలిడిటీని కల్పిస్తున్నారు. ఈ స్పెషల్ ఆఫర్ పొందాలంటే యూజర్ రూ.1508 చెల్లిస్తే సరిపోతుంది. ఆగష్టు 14 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ ఆఫర్ 90 రోజుల పాటు ఉంటుంది. ఔత్సాహికులు ఎయిర్సెల్ స్టోర్లలో సంప్రదించవచ్చు.
ఆఫర్లో భాగంగా ఎయిర్సెల్ అందిస్తున్న డ్యూయల్ సిమ్ జీపీఆర్ఎస్ ఫోన్ ‘ఆల్కాటెల్ వోటీ 318’ కీలక ఫీచర్లు:
డిస్ ప్లే రిసల్యూషన్ (128×160పిక్సల్స్),
బ్యాటరీ బ్యాకప్ (6 గంటల టాక్ టైమ్, 400 గంటలు స్టాండ్ బై),
డ్యూయల్ సిమ్,
టార్చ్ లైట్,
వైబ్రేటర్,
వీజీఏ కెమెరా,
ఎంపీత్రీ రింగ్ టోన్స్.
Comments
Best Mobiles in India


Click it and Unblock the Notifications








