ఇక ఎయిర్పోర్ట్లలో ఆన్-స్ర్కీన్ టికెట్లు అనుమతి!

విమానయానానికి సంబంధించి పేపర్ టికెట్లు ఇక పై హిస్టరీగా మారనున్నాయి. ఇండియన్ రైల్వేస్ తరహాలో ఆన్-స్ర్కీన్ టికెట్లకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) అనుమతించింది. దింతో ప్యాసెంజర్లు విమానాశ్రయ టెర్మినల్ బిల్డింగ్లోనికి ప్రవేశించేందుకు టికెట్లను పేపర్ ప్రింట్ అవుట్ల రూపంలో చూపించాల్సిన అవసరం ఉండదు. మొబైల్ లైదా ల్యాప్టాప్ల ద్వారా తమ టికెట్ స్ర్కీన్షాట్ను సదరు చెకింగ్ అధికారికి చూపిస్తే సరిపోతుంది. చెన్నై విమానాశ్రయ అధికారులు ఇప్పటికే ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. త్వరలోనే ఈ విధానాన్ని అన్ని విమానాశ్రయాల్లో అమలు చేయనున్నట్లు బీసీఏఎస్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications








