జియోకు షాక్.. ఎయిర్టెల్ 3జీలోనే 4జీ వేగం!
థర్డ్ జనరేషన్ (3జీ) టెక్నాలజీ నెట్వర్క్ 4జీ తరహా వేగాన్ని అందిపుచ్చుకునేలా నెట్వర్క్ అప్గ్రెడేషన్కు ఎయిర్టెల్ సిద్ధమైంది.
తన 3జీ మొబైల్ సర్వీసులను మరింత మెరుగుపరచే క్రమంలో భారతి ఎయిర్టెల్ సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమవద్ద అందుబాటులో ఉన్న థర్డ్ జనరేషన్ (3జీ) టెక్నాలజీ నెట్వర్క్ 4జీ తరహా వేగాన్ని అందిపుచ్చుకునేలా నెట్వర్క్ అప్గ్రెడేషన్కు ఎయిర్టెల్ సిద్ధమైంది.
Read More : 10 లక్షల ఫోన్లు అమ్మారు, అయినా క్రేజ్ తగ్గలేదు!

వినియోగదారులకు ప్రత్యేక ఈమెయిల్స్
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ క్రమంలో ఢిల్లీ -ఎన్సీఆర్ పరిధిలోని తమ యూజర్లకు నెట్వర్క్ అప్గ్రెడేషన్కు సంబంధించి ప్రత్యేక ఈమెయిల్స్ లెటర్స్ను ఎయిర్టెల్ పంపింది.

కొద్ది రోజుల పాటు నెట్వర్క్ సమస్యలు తప్పవు..
3జీ నెట్వర్క్ వేగాన్ని పెంచేందుకు తమ నెట్వర్క్ ఇంజినీర్లు కృషిచేస్తున్నారని, ఈ పక్రియలో భాగంగా కొద్ది రోజుల పాటు నెట్వర్క్ సమస్యలు తెలెత్తే అవకాశముందని, ఇందకు వినయోగదారులు సహకరించాలని సదరు ఈమెయిల్ లెటర్లో ఎయిర్టెల్ కోరినట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరింత బలోపేతం..
రిలయన్స్ జియోతో పోటీ పడే క్రమంలో ఎయిర్టెల్ తన 4జీ నెట్వర్క్ను దేశవ్యాప్తంగా మరింత బలోపేతం చేసుకుంటుంది. ఈ క్రమంలో ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు.

20MHz 4జీ స్పెక్ట్రమ్ కొనుగోలు..
తాజాగా ఎయిర్సెల్కు చెందిన 20MHz 4జీ స్పెక్ట్రమ్ను ఎయిర్టెల్ బుధవారం విజయవంతగా సొంతం చేసుకోగలిగింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. ఎయిర్సెల్ కంపెనీకి దేశవ్యాప్తంగా 8 టెలికం సర్కిళ్లలో 4జీ స్పెక్ట్రమ్ ఉంది. ఇప్పుడు ఈ స్పెక్ట్రమ్ను ఎయిర్టెల్ కొనుగోలు చేసింది.

డీల్ విజయవంతమవటంతో
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బిహార్, జమ్మూ అండ్ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, అస్సాం, నార్త్ ఈస్త్, ఒడిస్సా రాష్ట్రాల్లో ఎయిర్టెల్ 4జీ సేవలు మరింత ముమ్మరం కానున్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications