Airtel 5G కవరేజ్ విస్తృతమైన ఎయిర్ వేవ్స్ తో అంతర్జాతీయ మార్కెట్లలో సిద్ధంగా ఉంది!!
5G నెట్వర్క్లను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఎయిర్టెల్ సంస్థ యొక్క అంతర్జాతీయ యూనిట్లు వేగంగా పనిచేస్తున్నాయి. ఎయిర్టెల్ కెన్యాలో ఇప్పటికే 500 కి పైగా 5G రెడీ సైట్లు ఉన్నాయి. 5G కవరేజ్ టెల్కోస్కు లభించే స్పెక్ట్రం మీద ఆధారపడి ఉంటుంది. వినియోగదారులకు నిజమైన 5G వేగాన్ని అందించడానికి ఆపరేటర్లకు విస్తృతమైన ఎయిర్ వేవ్స్ అవసరం అవుతుంది. అభివృద్ధి చెందుతున్న టెలికాం నివేదిక ప్రకారం కెన్యా దేశంలోని మూడు ముఖ్యమైన ప్రదేశాలలో దాదాపు 600 సైట్లు 5G సపోర్టివ్గా అప్గ్రేడ్ చేయబడ్డాయి. కెన్యాలోని సంబంధిత మూడు ప్రదేశాలలో నైరోబి, మొంబాసా మరియు మలిండి ఉన్నాయి.

ఎయిర్టెల్ కెన్యా మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత దాస్ శర్మ మాట్లాడుతూ టెల్కో ప్రభుత్వం అవసరమైన స్పెక్ట్రంను కేటాయించే వరకు వేచి ఉంది. ఇప్పటికే 5G సిద్ధంగా ఉండటానికి అప్గ్రేడ్ చేసిన సైట్లలో ఎయిర్టెల్ ఇంకేమీ చేయనవసరం లేదని శర్మ అన్నారు. ఆపరేటర్ చేయాల్సిందల్లా స్పెక్ట్రం పొందడం మరియు 5G సేవలను ఎప్పుడు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం.

ఎయిర్టెల్ సంస్థ కెన్యాలో 5G సేవలను ప్రారంభించడానికి సరైన సమయం కోసం వేచి ఉంది. కెన్యాలో 5G ఆపరేషన్లను విజయవంతంగా చూడటానికి తక్కువ ధర గల 5 జి స్మార్ట్ఫోన్ల లభ్యత చాలా ముఖ్యమైనదని టెల్కో అభిప్రాయపడింది. 2023 నాటికి కెన్యాలో 5Gని వాణిజ్యపరంగా విడుదల చేయాలని ఆపరేటర్ ఆశిస్తున్నారు. రాబోయే రెండేళ్లలో విస్తృత శ్రేణి లభ్యత కలిగిన 5G నెట్వర్క్లను భారతదేశంలో కూడా స్థాపించే ఆలోచనలో ఉన్నారు. తక్కువ ధర వద్ద లభించే 5G స్మార్ట్ఫోన్లు కూడా దేశంలో లాంచ్ అవుతాయని చెప్పారు.

5G సేవలను వినియోగదారులకు అందుబాటులోకి అందివ్వడానికి మొదట ప్రభుత్వం అందించే స్పెక్ట్రంను పొందడానికి భారత ఆపరేటర్లు ఎదురు చూస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DOT) సవరించిన నేషనల్ ఫ్రీక్వెన్సీ కేటాయింపు ప్లాన్ (NFAP) ను ప్రకటించింది. ఇందులో భారతదేశంలో 5Gని విడుదల చేయడానికి ఆపరేటర్లకు ఎక్కువ శ్రేణి ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు ఉన్నాయి. ఎయిర్టెల్ ఒకే నెట్వర్క్ కోర్ నుండి 5G మరియు 4Gలను కలిసి బయటకు తీసుకురావడానికి డైనమిక్ స్పెక్ట్రం షేరింగ్ (DSS) టెక్నాలజీను ఉపయోగించే అవకాశం ఉంది. భారతదేశంలో 5G స్పెక్ట్రం వేలం 2021 రెండవ భాగంలో నిర్ణయించబడుతుంది.


Click it and Unblock the Notifications