Home
News

Airtel 5G నెట్‌వర్క్ ముంబై ట్రయల్స్‌లో అప్‌లోడ్, డౌన్‌లోడ్ స్పీడ్ ఎంతో తెలుసా??

భారతీ ఎయిర్‌టెల్ టెల్కో తన యొక్క వినియోగదారులకు 5G నెట్‌వర్క్ ను ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగానే ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో తన 5G నెట్‌వర్క్ టెస్ట్ ట్రయల్స్‌ను నిర్వహించింది. ఫీనిక్స్ మాల్‌లోని నోకియా యొక్క 5G గేర్‌ను ఉపయోగించి 5G నెట్‌వర్క్ ట్రయల్ జరిగింది. ఈ పరీక్ష సమయంలో ఎయిర్టెల్ యొక్క ట్రయల్ నెట్‌వర్క్ యొక్క స్పీడ్ టెస్ట్‌ను ప్రదర్శించడానికి ఒక వీడియోను కూడా టెల్కో సంస్థ చిత్రీకరించింది. ఇది కంపెనీ అల్ట్రా-లెస్ జాప్యం మరియు 850 Mbps వేగంతో అప్‌లోడ్ స్పీడ్ మరియు 1.2Gbps డౌన్‌లోడ్ స్పీడ్ ను సాధించగలిగింది.

ముంబై ట్రయల్

ముంబై ట్రయల్ సమయంలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్ గుర్గావ్ యొక్క సైబర్ హబ్ ప్రాంతంలో చివరి 5G నెట్‌వర్క్ ట్రయల్ సమయంలో సెట్ చేసిన 1Gbps యొక్క మునుపటి స్పీడ్ టెస్ట్ రికార్డును అధిగమించగలిగింది. గుర్తుచేసుకుంటే జనవరిలో ఎయిర్‌టెల్ సంస్థ NSA (నాన్-స్టాండ్ అలోన్) నెట్‌వర్క్ టెక్నాలజీ ద్వారా 1800 MHz బ్యాండ్‌పై హైదరాబాద్‌లోని వాణిజ్య నెట్‌వర్క్ ద్వారా ప్రత్యేక్షంగా 5G సేవలను విజయవంతంగా ప్రదర్శించిన మొదటి టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌గా నిలిచింది.

ఎయిర్‌టెల్ 5G

కొన్ని నివేదికల ప్రకారం ముంబై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీతో సహా నాలుగు భారతీయ టెలికాం సర్కిల్‌లలో ఎయిర్‌టెల్ 5G స్పెక్ట్రంను టెక్నాలజీ విభాగం (DoT) కేటాయించింది. కంపెనీకి 5G ట్రయల్ స్పెక్ట్రం 3500 MHz, 28 GHz మరియు 700 MHz బ్యాండ్లలో కేటాయించబడింది. అయితే రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ ఐడియా (Vi) లకు 5G ట్రయల్ స్పెక్ట్రంను 700 MHz, 3.5 GHz మరియు 26 GHz బ్యాండ్లలో కేటాయించబడింది.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా(Vi) మరియు ఎంటీఎన్ఎల్ సంస్థలు ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో 5G సాంకేతిక టెక్నాలజీ యొక్క ఉపయోగం మరియు యాప్ల కోసం ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతిని ఇవ్వబడ్డాయి. అప్పటి నుండి వారందరూ ఒరిజినల్ పరికరాల తయారీదారులు మరియు ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్ మరియు సి-డాట్ వంటి టెక్నాలజీ ప్రొవైడర్లతో తమ 5G నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంలో సహాయపడతారు. ట్రయల్ యొక్క ప్రస్తుత వ్యవధి ఆరు నెలలు. ఇందులో పరికరాల సేకరణ మరియు ఏర్పాటుకు రెండు నెలలు ఉంటాయి.

ట్రాయ్

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) భారతదేశంలో 5G స్పెక్ట్రం కోసం ఇంకా వేలం నిర్వహించలేదు. అయినప్పటికీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై స్టాండింగ్ కమిటీ 2021 చివరినాటికి లేదా 2022 ప్రారంభంలో 5G భారతదేశంలో కొంతవరకు ఉపయోగపడుతుందని పేర్కొంది. 4G నెట్‌వర్క్‌లు ఇంకా కనీసం 5 నుండి 6 సంవత్సరాల వరకు పనిచేస్తూనే ఉంటాయి అని కొంత మంది యొక్క విశ్లేషణ. ఇది కాకుండా రిలయన్స్ జియో ఇటీవలే ముంబైలో దేశీయంగా అభివృద్ధి చేసిన పరికరాలను ఉపయోగించి 5G ట్రయల్స్ కూడా నిర్వహించింది. 5G ఫీల్డ్ ట్రయల్స్ కోసం ముంబైలోని మిడ్ మరియు mm వేవ్ బ్యాండ్లలో కంపెనీ పనిచేసింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel 5G Network Mumbai Trials shows 1.2Gbps Download Speed and 850Mbps Upload Speed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X