ఎయిర్టెల్, Vi యూజర్లకు బ్యాడ్ న్యూస్!! ప్రీపెయిడ్ టారిఫ్ పెంపు ఆలోచన దిశగా అడుగులు
ఇండియాలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు అన్ని కూడా తమ యొక్క ప్రీపెయిడ్ టారిఫ్ పెంపుదలను 2021 చివరిలో తీసుకొనివచ్చాయి. ఈ ధరల పెంపు ప్రకటించి చాలా కాలం కాలేదు కానీ పరిశ్రమలోని కొన్ని కంపెనీలు మరో రౌండ్ టారిఫ్ పెంపు గురించి ఇప్పటికే మాట్లాడుతున్నాయి. భారతీ ఎయిర్టెల్ యొక్క CEO గోపాల్ విట్టల్ ఇటీవలి ఆదాయాల కాల్లో 2022లో మరో ప్రీపెయిడ్ టారిఫ్ పెంపు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఈ ధరల పెంపు అనేది వచ్చే మూడు లేదా నాలుగు నెలల్లో ఉండే అవకాశం ఉండవచ్చు అని విట్టల్ స్పష్టం చేశారు.

భారతీ ఎయిర్టెల్ సంస్థ మాత్రమే కాకుండా వోడాఫోన్ ఐడియా (Vi) కూడా తమ యొక్క ప్రీపెయిడ్ టారిఫ్ పెంపు గురించి మాట్లాడుతున్నదని గమనించండి. వొడాఫోన్ ఐడియా CEO రవీందర్ టక్కర్ కొన్ని సమావేశాలలో మాట్లాడుతూ టారిఫ్ల పెంపును ప్రవేశపెట్టడానికి కంపెనీ మరో రెండేళ్ల వరకు వేచి ఉండబోదని తెలిపారు. 2022లోనే Vi టారిఫ్ పెంపునకు వెళ్తుందని టక్కర్ సూచిస్తున్నారు. కానీ ప్రస్తుతం సిమ్ కన్సాలిడేషన్ గురించి టెల్కోలు కొంచెం ఆందోళన చెందుతున్నాయి. అందువల్ల సిమ్ కన్సాలిడేషన్ స్థాయి తగ్గిన తర్వాత మాత్రమే వారు మరో టారిఫ్ పెంపు గురించి ఆలోచించే అవకాశం ఎంతైనా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ARPU స్థాయి పెంపు అవసరంపై విట్టల్ అభిప్రాయం
ఎయిర్టెల్ తన ప్రతి వినియోగదారుడి యొక్క స్వల్పకాలిక సగటు ఆదాయం (ARPU) లక్ష్యం రూ.200 అయితే దీర్ఘకాలిక యూజర్ల లక్ష్యం సుమారు రూ.300 అని పదే పదే వ్యక్తం చేసింది. భారతీ ఎయిర్టెల్ వంటి సంస్థ రూ. 300 ARPU స్థాయిని చేరుకోవడానికి 15% RoCE పెంపు అవసరం అని విట్టల్ తెలిపారు. టారిఫ్ పెంపు స్వల్ప ప్రభావంతో టెల్కో యొక్క ARPU ఇప్పటికే దాదాపు రూ.10 QoQ పెరిగి రూ.163కి చేరుకుంది. టారిఫ్ పెంపు పూర్తి ప్రభావం FY22 చివరి త్రైమాసికంలో కనిపించవచ్చు.

భారతీ ఎయిర్టెల్ తన ఏకీకృత నికర లాభంలో 2.8 శాతం క్షీణించి రూ.830 కోట్లతో సరిపడింది. క్రితం ఏడాది ఇదే కాలంలో డిసెంబర్ 31, 2021తో ముగిసిన మూడవ త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ.854 కోట్లు. నివేదించబడిన సమాచారం ప్రకారం త్రైమాసికంలో భారతీ ఎయిర్టెల్ ఏకీకృత ఆదాయం 12.6 శాతం పెరిగి రూ.29,867 కోట్లకు చేరుకున్నది. డిసెంబర్ 2020 త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.26,518 కోట్లు. భారతదేశంలో భారతీ ఎయిర్టెల్ యొక్క 4G కస్టమర్లు డిసెంబర్ 2020 త్రైమాసికంలో 16.56 కోట్ల నుండి డిసెంబర్ 2021 త్రైమాసికంలో 18.1 శాతం పెరిగి 19.5 కోట్లకు చేరుకున్నారు. భారతదేశంలో భారతీ ఎయిర్టెల్ ఇండియా నెట్వర్క్లో ప్రతి కస్టమర్ డేటా వినియోగం ఏడాది క్రితం 16.37GB నుండి 11.7 శాతం పెరిగి 18.28 గిగాబైట్లకు పెరిగింది.

ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా (Vi)కి కూడా కావాల్సింది ఇదే. ప్రీపెయిడ్ టారిఫ్ పెంపు లేకుండా వోడాఫోన్ ఐడియా సుదీర్ఘకాలం కొనసాగడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు. భారతదేశంలో మొబైల్ టారిఫ్లు ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నాయి. తద్వారా ఆపరేటర్లు మంచి రాబడిని పొందగలుగుతారు. కాబట్టి వారందరూ 2022లో ప్రీపెయిడ్ టారిఫ్ పెంపుతో ముందుకు సాగితే ఆశ్చర్యపోనవసరం లేదు.


Click it and Unblock the Notifications