Home
News

ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా మొబైల్ చందాదారులకు బ్యాడ్ న్యూస్

ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా టెలికాం కంపెనీల సర్దుబాటు చేసిన స్థూల రాబడి (AGR) పెమెంట్స్ లపై గల పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇటీవల కొట్టివేసింది. వోడాఫోన్-ఐడియా మరియు భారతి ఎయిర్‌టెల్ తమ AGR బకాయిలపై సుప్రీంకోర్టు నుండి ఉపశమనం పొందకపోవడంతో భారీ మొత్తంలో ప్రభుత్వానికి డబ్బును కట్టడానికి మరియు తమ యొక్క ఆర్థిక బలాన్ని మెరుగుపరచుకునే ప్రయత్నంలో భాగంగా కంపెనీలు తమ ప్లాన్ ల యొక్క ధరలను పెంచే ఆలోచనలో ఉన్నారు.

టెలికాం కంపెనీలు

టెలికాం కంపెనీలు గత సంవత్సరం చివరిలో అభ్యర్థన కోసం కోర్టులో పెట్టుకున్న సమీక్ష పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో టెలికాం కంపెనీలకు మాత్రమే కాకుండా భారతదేశంలోని మొబైల్ చందాదారులకు కూడా మంచిదని తెలుస్తున్నది. ఎందుకంటే ఈ నగదు ఆకలితో ఉన్న టెలికం కంపెనీలు మొబైల్ సుంకాలను పెంచే అవకాశం ఉంది.

 

 

మొబైల్ బిల్లులు మరో 25-30% పెరగవచ్చు

మొబైల్ బిల్లులు మరో 25-30% పెరగవచ్చు

ప్రతి వినియోగదారుడి యొక్క సగటు ఆదాయం (ARPU) ఇప్పటికీ 180-200 'ప్రీ-జియో' స్థాయిల కంటే చాలా తక్కువగా ఉంది. గత మూడేళ్ళలో మొత్తం టెలికాం-సంబంధిత వినియోగదారుల వ్యయం (GDP శాతంగా) తగిన పరిధి కంటే తక్కువగా ఉంది. ఈ ఏడాది చివర్లో సుంకాలను మరో 30% పెంచాలని టెల్కోస్ భావిస్తున్నాయి అని IIFL సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ మీడియాతో తెలిపారు.

 

 

టారిఫ్ పెంపు వోడాఫోన్-ఐడియా మనుగడపై ఆధారపడి ఉంటుంది

టారిఫ్ పెంపు వోడాఫోన్-ఐడియా మనుగడపై ఆధారపడి ఉంటుంది

మొబైల్ టారిఫ్ యొక్క ధరల పెరుగుదల అనేది తరువాత వోడాఫోన్-ఐడియా యొక్క మనుగడపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది విశ్లేషకులు భారతి ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నుండి ప్రైవేట్ డ్యూపోలీ నిర్మాణంలో అధిక మొత్తంలో ధరల పెరుగుదలను ఆశిస్తున్నారు.

 

 

వోడాఫోన్-ఐడియా అన్వేషనలు

వోడాఫోన్-ఐడియా అన్వేషనలు

వోడాఫోన్-ఐడియా ప్రస్తుతం మరిన్ని ఎంపికలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ వారం ఆరంభంలో కంపెనీ AGR తీర్పులో మార్పులు కోరుతూ ఉన్నత కోర్టును ఆశ్రయించింది. కొంతమంది విశ్లేషకులు జనవరి 23 నాటికి ప్రభుత్వం తన చట్టబద్ధమైన బకాయిల్లో కొంత భాగాన్ని డిఫాల్టర్ ట్యాగ్ పొందలేదని లేదా సుప్రీంకోర్టు యొక్క అసంతృప్తికి గురికాకుండా చూసుకోవడాన్ని చూస్తున్నారు. ఇది కంపెనీకి చాలా వరకు సహాయపడుతుంది. మూడు టెలికాం కంపెనీలకు బకాయిలు చెల్లించడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆఖరి గడువు జనవరి 23 మాత్రమే. టెలికాం శాఖ ప్రకారం వోడాఫోన్-ఐడియా రూ.19,823.71 కోట్లు, ఎయిర్‌టెల్ సుమారు రూ.23,000 కోట్లు, ఆర్‌కామ్ రూ .16,456.47 కోట్లు చెల్లించాలి.

 

 

వినియోగదారుడి సగటు ఆదాయం (ARPU)

వినియోగదారుడి సగటు ఆదాయం (ARPU)

టెలికామ్ పరిశ్రమ అధికారులు మరియు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మొత్తంమీద టెలికాం సంబంధిత వినియోగదారుల సగటు ఆదాయం (ARPU) భారతదేశంలో తక్కువగా ఉంది. భారతదేశంలో కమ్యూనికేషన్ల కోసం వినియోగదారులు ఖర్చు చేయడం సింగపూర్, మలేషియా, చైనా / హాంకాంగ్, ఫిలిప్పీన్స్, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్, యుకె, జర్మనీ మరియు ఫ్రాన్స్ కంటే తక్కువగా ఉందని చెబుతున్నారు.

 

 

టారిఫ్‌

దాదాపు 3 సంవత్సరాల తరువాత 2019 డిసెంబర్‌లో భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా మరియు రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్‌ యొక్క ప్రీపెయిడ్ సుంకాలను 14-33% పెంచాయి. రాబోయే 6-9 నెలల్లో 15% దాటిన సుంకాలపై ఏవైనా సవరణలు చేస్తే కనుక దేశంలో మొబైల్ చందాదారుల సంఖ్య తగ్గవచ్చని ఎస్‌బికాప్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రాజీవ్ శర్మ తెలిపారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel And Vodafone-Idea In Trouble After Their Review Petition On AGR Got Dismissed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X