Home
News

కారోనా సమయంలో రూ.270 కోట్ల ఉచిత ప్రయోజనాలను ప్రకటించిన ఎయిర్‌టెల్

ఇండియాలో ఇప్పుడు కరోనా యొక్క సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో లాక్ డౌన్ తిరిగి అమలులోకి రావడంతో దేశంలో ఎక్కువ మంది చేతిలో పనిలేక ఆదాయం కోసం కష్టాలను చవిచూస్తున్నారు. లాక్డౌన్ల సమయంలో తమ యొక్క వినియోగదారులు పడే బాధను భారతి ఎయిర్టెల్ టెలికాం సంస్థ గుర్తించింది. ఆన్‌లైన్‌లో తమ ఫోన్‌లను ఎలా రీఛార్జ్ చేయాలో తెలియని కస్టమర్‌లు తమ ప్రియమైనవారికి ఫోన్ కాల్ చేయలేరు మరియు కనెక్ట్ అవ్వలేరు.

డబుల్ బెనిఫిట్స్‌

అటువంటి కస్టమర్లకు సహాయం చేయడానికి మరియు లాక్డౌన్ల కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే తక్కువ-ఆదాయ వినియోగదారుల కోసం ఎయిర్టెల్ రూ.49 ప్యాక్ ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నది. ఇదే కాకుండా డబుల్ బెనిఫిట్స్‌ ప్రయోజనంతో రూ.79 ప్లాన్‌ను వినియోగదారులకు కంపెనీ అందించనుంది. ఇది సంస్థ నుండి వన్-టైమ్ మాత్రమే పొందవచ్చు. అయితే ఇది భారతదేశంలో నివసిస్తున్న మిలియన్ల మంది వినియోగదారులకు ఎంత వరకు సహాయపడుతుంది అన్న దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ రూ .49 ప్యాక్, రూ .79 ప్లాన్ బెనిఫిట్స్

ఎయిర్‌టెల్ రూ .49 ప్యాక్, రూ .79 ప్లాన్ బెనిఫిట్స్

భారతి ఎయిర్‌టెల్ నుంచి లభించే 49 రూపాయల ప్యాక్‌లో రూ.38 విలువైన టాక్‌టైమ్, 100MB డేటా ప్రయోజనాలు 28 రోజుల వాలిడిటీ కాలానికి లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్యాక్ ఎటువంటి ఛార్జీలు లేకుండా వినియోగదారులకు ఉచితంగా అందించబడుతుంది. భారతి ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యొక్క వినియోగదారుల కోసం రూ.79 ధర వద్ద లభించే ప్లాన్ యొక్క ప్రయోజనాలను కంపెనీ రెట్టింపు చేస్తుంది. రూ.79 రీఛార్జ్ ప్లాన్‌లో ప్రస్తుతం రూ.128 విలువైన టాక్‌టైమ్, 200MB డేటా వంటి ప్రయోజనాలు 28 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను తీసుకున్న తర్వాత ప్రతి నిమిషం వాయిస్ కాల్ 60 పైసల ఛార్జీని ఆకర్షిస్తుంది. ఇంకా 200MB డేటా వినియోగం తరువాత ప్రతి MB డేటాకు 50 పైసల ఛార్జీని ఆకర్షిస్తుంది.

ఉచితంగా రూ.270 కోట్ల విలువైన ప్రయోజనాలు

ఉచితంగా రూ.270 కోట్ల విలువైన ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ యొక్క కొత్త ప్రయోజనాల చొరవ ద్వారా భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 55 మిలియన్ల తక్కువ ఆదాయ వినియోగదారులకు సహాయం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఇస్తున్న మొత్తం ప్రయోజనాల విలువ సుమారు రూ.270 కోట్లు. ఈ గొప్ప వినియోగంతో బాధిత వినియోగదారులు తమ ప్రియమైనవారితో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. అలాగే దేశంలో ఏమి జరుగుతుందో దాని గురించి కూడా సులభంగా తెలుసుకోవచ్చు.

రిలయన్స్ జియో కొత్త ఉచిత ఆఫర్‌లు

రిలయన్స్ జియో కొత్త ఉచిత ఆఫర్‌లు

రిలయన్స్ జియో టెలికాం సంస్థ తన యొక్క జియోఫోన్ వినియోగదారుల కోసం ఇప్పుడు రెండు కొత్త ఆఫర్లను విడుదల చేసింది. ఇందులో మొదటి ఆఫర్ విషయానికి వస్తే ఇది వినియోగదారులకు ఒక నెలలో 300 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను ఉచితంగా అందిస్తుంది. వినియోగదారులకు అందించే మొత్తం 300 నిమిషాల ఉచిత వాయిస్ కాల్‌లో రోజువారీ 10 నిమిషాల పరిమితం చేయబడి ఉంటుంది. కాబట్టి వినియోగదారులు ఈ 10 నిమిషాల ఉచిత వాయిస్ కాలింగ్‌ను నెలలో ప్రతి రోజు (10 నిమిషాలు x 30 రోజులు = 300 నిమిషాలు) ఉపయోగించవచ్చు. లాక్డౌన్ పరిమితుల కారణంగా తమ జియోఫోన్‌ను రీఛార్జ్ చేయలేని వ్యక్తులకు సహాయం చేయడానికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.


జియోఫోన్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో ప్రారంభించిన రెండవ ఆఫర్ విషయానికి వస్తే ‘బయ్-వన్-గెట్-వన్' ఆఫర్. ఈ ఆఫర్ సంస్థ అందించే అన్ని జియోఫోన్ ప్లాన్‌లకు వర్తిస్తుంది. ఉదాహరణకు వినియోగదారులు ఎవరైనా సరే రూ.75 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే కనుక వారు అదనంగా మరొక రూ.75 ప్లాన్ యొక్క చందాను ఉచితంగా పొందుతారు. అది తరువాత ఉపయోగం కోసం క్యూలో ఉంటుంది. మహమ్మారి మరియు లాక్డౌన్ల కారణంగా ఇళ్ళకే పరిమితమైన వినియోగదారులకు ఈ ప్లాన్లు మరియు ఆఫర్లు ఖచ్చితంగా సహాయపడతాయి. అంతేకాకుండా వినియోగదారులు వారి పనికి అంతరాయం ఏర్పడిన సమయంలో డబ్బు ఆదా చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.

 

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Announced Rs.270cr Worth Benefits to Help 55 Million Low Income Customers to Tide Over The Impact of Covid-19
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X