సరికొత్తగా ఎయిర్టెల్, ఇకపై ప్లాన్లు అందరికీ..
జియో రాకతో టెలికం మార్కెట్లో పలు ప్రకపంనలు రేకెత్తిన నేపధ్యంలో అన్ని టెల్కోలు తమ యూజర్లు ఎక్కడ ఇతర నెట్వర్క్లకు తరలిపోతారో అని డేటా ఆఫర్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.
జియో రాకతో టెలికం మార్కెట్లో పలు ప్రకపంనలు రేకెత్తిన నేపధ్యంలో అన్ని టెల్కోలు తమ యూజర్లు ఎక్కడ ఇతర నెట్వర్క్లకు తరలిపోతారో అని డేటా ఆఫర్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. జియో రాక ముందు ఆకాశంలో ఉన్న డేటా ధరలు జియో రాకతో ఒక్కసారిగా నేలకు దిగివచ్చాయన్నది కాదనలేని వాస్తవం. అయితే ఈ నేపథ్యంలో కొన్ని ప్లాన్లు కొన్ని ప్రాంతాలకే పరిమితం అన్న నానుడి కూడా ఉంది. ఇప్పుడు ఈ నానుడిని ఎయిర్టెల్ తీసివేస్తూ నిర్ణయం తీసుకుంది.

గతంలో కొందరికి మాత్రమే ఇచ్చే బెనిఫిట్లను..
తాజాగా ఎయిర్టెల్ వినియోగదారులను ఆకర్షించేందుకు సరికొత్త పంధాను ఎన్నుకుంది. గతంలో కొందరికి మాత్రమే ఇచ్చే బెనిఫిట్లను ఇప్పుడు అందరికీ అందివ్వనుంది.

ఏదైనా కొత్త ప్లాన్ ప్రవేశ పెడితే..
గతంలో ఏదైనా కొత్త ప్లాన్ ప్రవేశ పెడితే అది సదరు వినియోగదారుడికి వర్తిస్తుందో లేదో తెలుసుకోవడానికి మైఎయిర్టెల్ యాప్లో చూసుకోవాల్సి వచ్చేది. అందులో ఆఫర్ల జాబితాలో లేకపోతే అది వినియోగదారుడికి వర్తించదు. అయితే తాజగా ఎయిర్టెల్ ఆ విధానానికి స్వస్తి పలికింది.

ప్రీపెయిడ్ ప్రామిస్ పథకం కింద..
ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్రామిస్ పథకం కింద, ఎక్కువ మంది ఎయిర్టెల్ కష్టమర్లు వాడుతున్న కొన్ని ప్లాన్లను, ఓపెన్ మార్కెట్ ప్లాన్లుగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ఐదు ప్లాన్లు ఇకపై..
రూ. 179, రూ. 349, రూ. 448, రూ. 549, రూ. 799 ప్లాన్లని ఇలా అందరికీ వర్తించే విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ ఐదు ప్లాన్లు ఇకపై ఆ నిర్థిష్టమైన టెలికం సర్కిల్లో ఉన్న ఎయిర్టెల్ వినియోగదారులు అందరికీ వర్తిస్తాయి.


Click it and Unblock the Notifications








