ఇంటి వద్దే ఉండి Airtel, Jio యూజర్లు 5G సిమ్ పొందొచ్చు.. ఇది చదవండి!
భారతదేశంలో 5G సేవలు గత వారం నుంచి ప్రధాని మోదీ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, జియోలు ఇప్పటికే పలు నగరాల్లో తమ 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. 5జీ నెట్వర్క్తో యూజర్లు 4జీతో పోలిస్తే 10 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ను పొందుతారు. అయితే, ఈ సేవలను పొందడానికి వినియోగదారులు 4G SIM కార్డ్కు బదులుగా 5G SIM కార్డ్ని ఉపయోగించాల్సి ఉంటుంది.

ఈ పరిస్థితిలో మీరు కొత్త 5జీ సిమ్ను ఎలా కొనుగోలు చేయాలి అని ఆలోచిస్తున్నారా., అయితే అందుకోసం ఈ రోజు మేము మీకు సులభమైన మార్గాన్ని అందిస్తున్నాం. ఇందుకోసం మీరు ఇళ్లు కూడా దాటి బయటకు అడుగు పెట్టాల్సిన పని లేదు. ఈ పద్దతి పాటించినట్లయితే.. 5G సిమ్ నేరుగా మీ ఇంటికి డెలివరీ చేయబడుతుంది. మీరు ఇంట్లో కూర్చొని ఈ సిమ్ని ఆర్డర్ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
Jio 5G SIMని ఆన్లైన్లో ఆర్డర్ చేయండి ఇలా:
Jio ఇప్పటికే తన 5G నెట్వర్క్ సేవల గురించి అనేక ప్రకటనలు చేసింది. ఇప్పుడు అందరి దృష్టి 5జీ సిమ్పైనే ఉంది. ఎందుకంటే 5G నెట్వర్క్ ప్రారంభించిన వెంటనే సిమ్ కార్డ్ అవసరం అవుతుంది. మీరు ఇంట్లో జియో సిమ్ పొందవచ్చు. మీరు దుకాణానికి కూడా వెళ్లవలసిన అవసరం లేదు. మీరు దీన్ని Jio వెబ్సైట్ https://www.jio.com/selfcare/interest/sim/ నుండి కూడా ఆర్డర్ చేయవచ్చు. అయితే, అందుకోసం మీరు ఇక్కడ కొన్ని ఫారమ్లను పూర్తి చేయాలి.

ఈ సాధారణ దశలను అనుసరించండి:
ముందుగా మీరు మీ పేరు మరియు మొబైల్ నంబర్ ఇవ్వాలి. దీని కింద గెట్ సిమ్ ఆప్షన్ను చూడవచ్చు. ఆ తర్వాత మీరు కొంత వ్యక్తిగత సమాచారాన్ని పూరించాలి. అనంతరం, మీరు 5G SIM పొందాలనుకుంటున్న చిరునామాను చేర్చాలి. దీని తర్వాత సిమ్ కార్డు కొద్ది రోజుల్లో మీ ఇంటికి డెలివరీ చేయబడుతుంది.
Airtel 5G SIMని ఆన్లైన్లో ఎలా ఆర్డర్ చేయాలి:
ఎయిర్టెల్ నుంచి 5G SIMని ఆర్డర్ చేయడానికి మరియు అక్కడ కనెక్షన్ రకాన్ని నమోదు చేయడానికి ఈ పద్దతిని పాటించండి. ముందుగా మీరు Airtel యొక్క అధికారిక వెబ్సైట్ https://www.airtel.in/myplan-infinity/submit-formని సందర్శించాలి. ఆ తర్వాత KYC ప్రక్రియను పూర్తి చేయాలి. అనంతరం మీరు అందులో ఇచ్చిన అడ్రస్కు SIM కార్డ్ అక్కడ డెలివరీ చేయబడుతుంది. అయితే, మీరు సిమ్ను ఆర్డర్ చేసేటప్పుడు మీ పేరు, చిరునామా మరియు మొబైల్ నంబర్ను సరిగ్గా సమర్పించాలి. మీ ఇంటికి SIM కార్డ్ని సరఫరా చేసే ముందు, మీరు తప్పనిసరిగా మీ ఒరిజినల్ IDని సిద్ధంగా ఉంచుకోవాలి.

మీ Android స్మార్ట్ఫోన్లో 5Gని ఎలా యాక్టివేట్ చేయాలి?
5G ప్రస్తుతం భారతదేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులో ఉంది. రాబోయే నెలల్లో మరిన్ని నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాలు 5G మద్దతు ఉన్న ప్రాంతాల జాబితాకు జోడించబడతాయి. 5Gకి ముందస్తు యాక్సెస్ ఉన్న నగరాల్లోని వినియోగదారులు తమ డివైజ్లో 5G నెట్వర్క్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయడం కోసం తమ స్మార్ట్ఫోన్లో నెట్వర్క్ సెట్టింగ్లకు వెళ్లాలి. మీది 5జీ మొబైల్ అయినట్లయితే.. అందులో 5G నెట్వర్క్ను ఎంపిక చేసుకోవడం ద్వారా యాక్టివేషన్ పూర్తవుతుంది.

ఆ నగరాల్లో ఎయిర్టెల్ 5జీ షురూ:
భారతదేశంలోని ప్రధాన టెలికాం కంపెనీలలో ఒకటైన Airtel, ఎనిమిది నగరాల్లో తన వినియోగదారులకు 5G సేవలు అందుబాటులోకి తెచ్చింది. భారతీ Airtel ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ 5జీ ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ, ఎయిర్టెల్ 5G న్యూఢిల్లీ, వారణాసి, ముంబై మరియు బెంగళూరు, చెన్నై, హైద్రాబాద్, సిలిగురి, నాగపూర్ నగరాల్లో 5జీ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆ నాలుగు నగరాల్లో జియో 5జీ:
భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ Jio తన 5G సేవల విషయంలో కీలక ప్రకటన చేసింది. భారతదేశంలోని నాలుగు నగరాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ నగరాల్లో ఢిల్లీ, ముంబై, కోల్కతా మరియు వారణాసి ఉన్నాయి. ఈ నగరాల్లో Jio సిమ్ కార్డ్లను కొనుగోలు చేసిన సబ్స్క్రైబర్లు 5G సేవలను ఉపయోగించుకోగలరు అని పేర్కొంది.


Click it and Unblock the Notifications








