Just In
- 2 hrs ago రైల్వే స్టేషన్ కౌంటర్లో టికెట్ బుకింగ్ చేస్తున్నారా.. ఏప్రిల్ 1 నుంచే కొత్త నిర్ణయం అమల్లోకి..!!
- 3 hrs ago Jio Airfiber, 5352 సిటీలకు విస్తరించింది! ఎలా బుక్ చేయాలి, ప్లాన్ల వివరాలు
- 6 hrs ago ఫ్లిప్కార్ట్ సమ్మర్ ఫెస్టివల్ డేస్ సేల్.. ఐఫోన్ 15 స్మార్ట్ఫోన్ పై భారీ డిస్కౌంట్.. పూర్తి వివరాలు..!
- 22 hrs ago 200MP కెమెరా, 256GB స్టోరేజీ Honor స్మార్ట్ఫోన్పై భారీ డిస్కౌంట్.. సేల్ వివరాలు..!
Don't Miss
- Sports అతడికి ఛాన్స్ ఇవ్వలేదు.. ఇంపాక్ట్ ప్లేయర్ మాత్రమే- సంజు శాంసన్
- Movies Premalu 16 Days Collections: ప్రేమలు సంచలనం.. 16 రోజుల్లో కోట్ల వర్షం.. రాజమౌళి కొడుకు కుమ్మేశాడుగా!
- News కురుపాం టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి భర్తపై ఈసీ వేటు..ఎందుకంటే..?
- Automobiles ఐపీఎల్ ఫ్యాన్స్కు టాటా పవర్ గుడ్ న్యూస్.. ఉప్పల్ స్టేడియం నుంచి ఈ రూట్లలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
- Finance Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు..! ఈ వారం కేవలం 3 రోజులే ట్రేడింగ్.. ఎందుకంటే..
- Lifestyle హోలీ రంగులు చర్మానికే కాకుండా గోళ్లకు కూడా హాని చేస్తాయి, అందమైన గోళ్ల కోసం ఈ చిట్కాలను పాటించండి.
- Travel ఐఆర్సీటీసీ సూపర్ ప్యాకేజ్.. హైదరాబాద్ నుంచి ఊటీ షెడ్యూల్ ఇదే!
ఎయిర్టెల్ యూజర్ల కోసం... ‘స్మార్ట్ డ్రైవ్’
హైదరబాద్: ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు గమ్యస్థానానికి తడబడకుండా చేరుకోవటం.. వెళ్లే దారిలో ట్రాఫిక్ అప్డేట్ను ముందుగానే తెలుసుకోవటం వంటి విశేషాలతో కూడిన ‘స్మార్ట్ డ్రైవ్’ మొబైల్ అప్లికేషన్ను ప్రముఖ టెలికామ్ ప్రొవైడర్ ఎయిర్టెల్ ఆవిష్కరించింది. యూజర్ తన మొబైల్లో ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసకున్నట్లయితే రూట్ అడ్ర లతో పాటు ట్రాఫిక్ సమాచారాన్ని వాయిస్ ఆధారితంగా తెలుసుకోవచ్చు. దేశంలో ఈ ‘రియల్ టైమ్ నేవిగేషన్’ సర్వీస్ను ప్రారంభించిన ఏకైక సంస్థగా తాము గుర్తింపు పొందినట్లు ఎయిర్టెల్ వర్గాలు ఒ ప్రకటనలో పేర్కొన్నాయి.
ఈ అప్లికేషన్ను పొందాలనుకునే సదరు ఎయిర్టెల్ వినియోగదారు తన మొబైల్ ద్వారా ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎయిర్టెల్లైవ్.కామ్/స్మార్ట్డ్రైవ్’’లోకి లాగినై డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ‘‘స్మార్ట్’’ అని టైప్ చేసి ‘543221’కి ఎస్ఎంఎస్ పంపితే సరిపోతుంది. ఈ అప్లికేషన్ ద్వారా రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్ ను నెల మొత్తం పొందాలనుకున్న వారు నెలసరి ప్యాక్ కింద రూ.49 చెల్లించాల్సి ఉంటుంది. ఒక రోజు అప్డేట్ కోసం రూ.3 చెల్లించాల్సి ఉంది. టర్న్ బై టర్న్ నేవిగేషన్ అప్లికేషన్ను నెల మొత్తం ఉపయోగించుకోవాలనుకునే వారు నెలసరి ప్యాక్ కింద రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. డైలీ ప్యాక్ విలువ రూ.10. ఆండ్రాయిడ్, సింబియాన్, బ్లాక్బెర్రీ ఇంకా విండోస్ ప్లాట్ఫామ్లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది.
భారత్లో ఎయిర్టెల్ వినియోగదారుల సంఖ్య 20 కోట్లు!
టెలీ కమ్యూనికేషన్ సర్వీస్లను అందిస్తున్న ప్రముఖ సంస్థ ఎయిర్టెల్ భారత్లో 20కోట్ల మంది వినియోగదారులు సంఖ్యను దాటింది. భారతి ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న 2జీ, 3జీ, 4జీ, ఫిక్సుడ్ లైన్, డీఎస్ఎల్ బ్రాడ్ బ్యాండ్, ఐపీటీవీ, డీటీహెచ్ సర్వీస్లను దేశ వ్యాప్తంగా 20 కోట్ల మంది వినియోగించుకుంటున్నారు. గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ఏకంగా 10 కోట్ల మంది కొత్త వినియోగదారులను భారతీ ఎయిర్టెల్ రాబట్టుకోగలిగింది. ఈ అంశం పై భారతీ ఎయిర్టెల్ సీఈవో(భారత్, దక్షిణ ఆసియా దేశాలు) సంజయ్ కపూర్ స్పందిస్తూ భారతీయ టెలికాం విభాగంలో తాము క్రీయాశీలక బాధ్యతలు చేపట్టటం గర్వకారణంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. పోటీ మార్కెట్కు అనుగుణంగా వ్యవహరించటంతో పాటు ఉత్తమమైన సేవలను వినియోగదారుకు అందించడం కారణంగానే మొదటి 14 సంవత్సరాల్లో 10 కోట్లు, తరువాతి మూడు సంవత్సరాల కాలంలో మరో 10 కోట్ల మంది వినియోగదారులను ఆకట్టుకోగలిగినట్లు ఆయన వెల్లడించారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470