ఎయిర్టెల్ కొత్త ప్లాన్ షురూ, వొడాపోన్ లాంటిదే..
జియో నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు దిగ్గజాలు సరికొత్త అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.
జియో నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు దిగ్గజాలు సరికొత్త అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. జియోకి కౌంటర్గా దిగ్గజాలన్నీ సరికొత్త ప్లాన్లను మీ ముందుకు తీసుకువస్తున్నాయి. ఈ నేఫథ్యంలో వొడాఫోన్ రూ.199తో సరికొత్త ప్లాన్ ను విడుదల చేసిన విషయం విదితమే. అయితే అలాంటి ప్లాన్తో ఇప్పుడు ఎయిర్టెల్ దూసుకువచ్చింది.

రూ.199కు కొత్త ప్రీపెయిడ్ టారిఫ్..
Airtel ఇప్పుడు రూ.199కు కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ను లాంచ్ చేసింది. 28 రోజుల వాలిడిటీతో దీన్ని తీసుకొచ్చింది. వొడాఫోన్ ప్రకటించిన కొత్త టారిఫ్ అనంతరం ఈ కొత్త రూ.199 ప్యాక్ను Airtel అందుబాటులోకి తీసుకువచ్చింది.

అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్
ఈ రూ.199 ప్యాక్ కింద ఎయిర్టెల్ ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్లు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ను, రోమింగ్పై అపరిమిత ఇన్కమింగ్ కాల్స్, అపరిమిత లోకల్, నేషనల్ ఎస్ఎంఎస్, రోజుకు 1జీబీ 3జీ, 4జీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు తెలిపింది.

ప్యాక్ ఎంపికచేసిన సర్కిళ్లకు..
ఈ ప్రయోజనాలన్నీ పాత, కొత్త ఎయిర్టెల్ ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్లందరికీ వర్తిస్తాయి. అయితే ఈ ప్యాక్ ఎంపికచేసిన సర్కిళ్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, కర్నాటక సర్కిళ్లకు ఈ కొత్త టారిఫ్ ప్లాన్ లభ్యమవుతుంది.

మై ఎయిర్టెల్ యాప్..
అయితే సబ్స్క్రైబర్లందరికీ మై ఎయిర్టెల్ యాప్లో ఈ ప్యాక్ యాక్టివేట్ అవాల్సి ఉంది. ప్రస్తుతం దీన్ని ఎయిర్టెల్ సైట్ నుంచి పొందాల్సి ఉంటుంది.

రూ.157 ప్యాక్..
ఈ ప్యాక్తో పాటు ఎయిర్టెల్ అదనంగా రూ.157 ప్యాక్ను కూడా లాంచ్ చేసింది. ఈ ప్యాక్ కింద 27 రోజుల పాటు 3జీబీ 3జీ, 4జీ డేటాను ఆఫర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications








