మార్కెట్లోకి ఎయిర్టెల్ కొత్త డేటా ప్యాక్స్
సునీల్ మిట్టల్ అధినేతగా ముందుకు వెళుతున్న దిగ్గజ టెలికాం సంస్థ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
సునీల్ మిట్టల్ అధినేతగా ముందుకు వెళుతున్న దిగ్గజ టెలికాం సంస్థ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.జియోతో పోటాపోటీగా దూసుకుపోతున్న ఈ దిగ్గజం మార్కెట్లోకి రోజు వారి , వీక్లి ప్లాన్లను ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్ కస్టమర్లకోసం ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్లతో ముందుకు వచ్చింది . టెలికాం కంపెనీ వెబ్సైట్ ప్రకారం భారతీ ఎయిర్టెల్ రెండు ప్లాన్లను లాంచ్ చేసింది. వాటిల్లో ఒకటి రూ. 49 ప్లాన్ కాగా, రెండవది రూ. 92 ప్లాన్. అందుబాటు ధరలో, హైస్పీడ్ డేటాను వినియోగదారులకు అందించే లక్ష్యంగా వీటిని ప్రారంభించినట్లు తెలుస్తోంది.

రూ.49 ప్యాక్
రూ.49 ప్యాక్ ద్వారా యూజర్లు 3జిబి హై స్పీడ్ డేటాను అందుకుంటారు. దీని వ్యాలిడిటీ ఒకరోజు మాత్రమే. అర్జెంట్ అవసరాల నిమిత్తం ఒకరోజులో ఎక్కువ డేటాను వాడుకునే వారు ఈ ప్లాన్ ని వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది.

రూ. 92 ప్యాక్
మరొక ప్లాన్ రూ. 92 ప్యాక్ 7 రోజులపాటు చెల్లుబాటులో ఉంటుంది. ఇందులో వినియోగదారులకు 6జీబీ డేటా అందిస్తుంది.డేటా వినియోగంపై రోజువారీ నిబంధన ఏదీ లేదు. అంటే ఏడు రోజుల్లోనూ ఎపుడైనా 6జీబీ డేటా వాడు కోవచ్చు. కాగా ఈ రెండు ప్లాన్లలోనూ అధిక-వేగ డేటాను ఆఫర్ చేస్తుంది.

రూ. 48 నుంచి రూ.398 వరకు
కాగా ఎయిర్టెల్ రూ. 48 నుంచి రూ.398 వరకు పలు రకాల ప్లాన్లను అందిస్తోంది. రూ.48 ప్లాన్ ద్వారా 400 ఎంబిని 10 రోజుల పాటు అందిస్తోంది. అలాగే రూ. 98 ప్యాక్ ద్వారా 1జిబి డేటాను 28 రోజుల పాటు అందిస్తోంది.

రూ.349 ప్లాన్ ద్వారా..
రూ.175 రీఛార్జ్ మీద 2జిబి డేటాను 28 రోజుల పాటు అందిస్తోంది. అలాగే రూ. 248 రీఛార్జ్ ద్వారా 3జిబి డేటాను 28 రోజుల పాటు అందిస్తోంది. అలాగే రూ. 398 ప్యాక్ ద్వారా 5జిబి డేటాను 28 రోజుల పాటు అందిస్తోంది. దీంతో పాటు రూ.349 ప్లాన్ ద్వారా రోజుకు 3జిబి డేటాను నెల రోజుల పాటు అందిస్తోంది. ఇందులో కాల్స్ అపరిమితం. రోజుకు 100 ఎసెమ్మెస్ లు ఉచితం.


Click it and Unblock the Notifications








